మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నగారా మోగింది. మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సంబంధించి సీఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. 19న కౌంటిగ్ నిర్వహించి ఫలితాలు విడుదల ప్రకటించనుంది. 90 మంది సభ్యులున్న హర్యానా శాసనసభ పదవీ కాలం అక్టోబరు 27న, 288మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబరు 8న ముగియనుంది. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో ఐదు అసెంబ్లీ స్థానాలకూ అక్టోబర్ 15న ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గత సార్వత్రిక ఎన్నికల నుంచే అమల్లోకి వచ్చిన నోటా బటన్ను ఈ సారి కూడా ఈవీఎంలలో కేంద్ర ఎన్నికల సంఘం నిక్షిప్తం చేయనుంది. అంతేకాక ఓటరు తన ఓటు ఎవరికి వేశామో తెలుసుకునేందుకు వీలుండే పేపటర్ ట్రయల్ని .. మహారాష్ట్రలో 3942 పోలింగ్ కేంద్రాలలోనూ, హర్యానాలో 959 పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేసింది. ఎన్నికలక షెడ్యూల్ విడుదలైనందున ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చిందన్న కేంద్ర ఎన్నికల కమీషన్.. వరదలతో అతలాకుతలమవుతున్న జమ్మూకశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకన్న తరువాతే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహణపై ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more