Ap government sent relief fund to flood affeclted kashmir

jammu kashmir, kashmir floods, jammu floods, heavy rains, rains, landslides, jammu flood deaths, jammu kashmir flood videos, panic incidents, army, ndrf, rescue operations, latest news, andhrapradesh, relief fund, helicopters

andhrapradesh government sent rs.5crores relief fund and 300metric tons of food to jammu kashmir : andhrapradesh sent relief material to jammukashmir through flight, says ready to do more help

బాధిత జమ్మూకు ఏపీ సాయం

Posted: 09/10/2014 03:53 PM IST
Ap government sent relief fund to flood affeclted kashmir

వరద భీభత్సంతో వణుకుతున్న జమ్మూ కాశ్మీర్ దుస్థితిపై ఆంద్రప్రదేశ్ స్పందించింది. బాధిత రాష్ర్టానికి సాయం ప్రకటించింది. రూ.5కోట్ల వరద సాయం ప్రకటించింది. 300మెట్రిక్ టన్నుల ఆహార పధార్ధాలను అందించాలని నిర్ణయించింది. ముందుగా అత్యవసరంగా 145మెట్రిక్ టన్నుల ఆహార పధార్ధాలను విమానం ద్వారా పంపించింది. త్వరలోనే మిగతా సాయాన్ని అందిస్తామని ఏపీ ప్రభుత్వ విపత్తు నిర్వహణా ఉన్నతాధికారులు తెలిపారు. ప్రజలు కూడా స్వచ్చందంగా సాయం చేయవచ్చని  సూచించారు.

వరదలతో సర్వం కోల్పోయిన జమ్మూ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అండగా నిలుస్తుందని రాష్ర ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే మరింత సాయం చేసేందుకు కూడా సిద్దమని ప్రభుత్వ నేతలంటున్నారు. భారీ వర్షాలతో వరదలు రావటంతో జమ్మూలో ఇప్పటివరకు 200పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. ఇక లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత మూడ్రోజులతో పోలిస్తే వరదలు తగ్గినా ఇప్పటికీ చాలామంది నీటిలోనే చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. భారత సైనికులు, వైమానిక దళం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విపత్తు నిర్వహణా బృందాలు ప్రత్యేక విమానాలు, పడవల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అయితే సాయం చేయటానికి వచ్చిన విపత్తు నిర్వహణా బృందం అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. ఆలస్యంగా సాయం చేయటానికి వచ్చారంటూ ఓ ప్రాంతంలో ప్రజలు ఇద్దరు సిబ్బందిపై దాడి చేయగా వీరిలో ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే అధికారిని చికిత్స కోసం చండీఘర్ ఆస్పత్రికి తరలించారు. అటు సాయం చేసేందుకు వస్తున్న హెలికాప్టర్లపై కూడా ప్రజలు ఆగ్రహంతో రాళ్ళు వేస్తుండటంతో చాపర్లు కిందకు దిగలేకపోతున్నాయి. ఇలాంటి చర్యల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని అధికారులు అంటున్నారు. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకుండా సాయం కోసమే పనిచేస్తుంటే దాడులు చేయటం సరికాదని ఆర్మీ, సహాయక బృందాలు అంటున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  relief fund  andhrapradesh  floods  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more