Soldiers encounters five terrorists in kashmir border

jammu kashmir, soldiers, war, kashmir border, india pakisthan border, indian army, bsf soldiers, jawans, latest news, encounter, terrorist attacks, terrorists dead

in jammu kashmir encounter between soldiers and terrorists five millitants dead : five millintants in jammu kashmir dead in huge encounter by soldiers

కాశ్మీర్లో కాల్చిపారేసిన జవాన్లు

Posted: 09/10/2014 10:42 AM IST
Soldiers encounters five terrorists in kashmir border

జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ జవాన్లకు తీవ్రవాదులకు మద్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పాకిస్థాన్ నుంచి కెరాన్ సెక్టార్ ద్వారా తెల్లవారుజామున దేశంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా ఆర్మీ అప్రమత్తమై కాల్పులు జరిపింది. వీరిపై ఉగ్రవాదులు తిరిగి కాల్పులు జరపగా.., ఇరువర్గాల మద్య భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో దుగురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు భారీగా ఆయుదాలు, విద్వంసకర సామాగ్రి కలిగి ఉన్నట్లు సైన్యం వెల్లడించింది.

ఒక వైపు వరదల విలయం నుంచి ప్రజలను రక్షించేందుకు ఆర్మీ సహా ఇతర విభాగాలు తీవ్రంగా శ్రమిస్తుండటంతో.., దీన్ని ఆసరాగా చేసుకున్న ఉగ్రవాదులు సరిహద్దులో సైన్యం తక్కువగా ఉంటుందని భావించి చొరబాట్లకు యత్నిస్తున్నారు. అయితే సహాయక చర్యలతో పాటు, సరిహద్దు రక్షణను కూడా సమర్ధంగా నిర్వహిస్తున్న సైన్యం, ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత ఆర్మీ, సరిహద్దు రక్షణా దళం అప్రమత్తతపై హర్షం వ్యక్తం అవుతోంది. ప్రజలను కాపాడుతూనే దేశ రక్షణ కోసం అహర్నిశలూ వారు కృషి చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.

భారీ వరదలతో పాటు త్వరలో చలికాలం మొదలవుతుండటం కూడా చొరబాట్లకు ఉగ్రవాదులకు కలిసి వచ్చే అంశం. హిమఖండమైన కాశ్మీరంలో చలికాలంలో దట్టంగా మంచు కప్పేసుకుని ఉంటుంది. ఈ మంచులో ఎవరు వస్తున్నారు. ఎవరు వెళ్తున్నారు అని గుర్తించటం కష్టం. దీనికి తోడు మంచుకురుస్తుండగా విధులు నిర్వర్తించటం కూడా సైన్యంకు కొంత కష్టంతో కూడుకున్న పని. దీన్ని ఆసరాగా చేసుకునే ఉగ్రవాదులు చలికాలంలో ఎక్కువగా దేశంలోకి చొరబడుతుంటారు. అయితే చాలికాలం ప్రారంభం కాకముందే చొరబాట్లు పెరగటంతో ఆర్మీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  terrorists encounter  soldiers  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more