ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. మంగళవారం నాటితో వందరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాళోజీ శతయ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. అలాగే ఆయన ఈ వందరోజుల్లో చేసిన పాలన కూడా ఎంతో అమోఘం అంటూ ఆయన పార్టీకి చెందిన మంత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కేసీఆర్ మీద ధ్వజమెత్తింది. కేసీఆర్ పాలన హిట్లర్, తుగ్లక్ లను మరిపిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన కర్రపత్రాలను కూడా విడుదల చేశారు.
ఈనేపథ్యంలోనే పొన్నాల మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు స్వర్గాన్ని చూపాయని.. కానీ సీఎం సీఠం ఎక్కిన అనంతరం నరకం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పులు చేయడలో కేసీఆర్ శిశుపాలుడ్ని మిండిపోయారని పేర్కొన్న ఆయన.. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ గోబెల్స్ కే పాఠాలు చెబుతారని అన్నారు. కేసీఆర్ పాలన కుంభకర్ణుడి వారుసుడిగా, నీరోను తలపించేవిధంగా వుందని వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలకు నచ్చడం లేదని అన్నారు. కరెంటు, కరువు వంటి రైతాంగ సమస్యలపై కేసీఆర్ సమీక్షించని నేపథ్యంలో ఇప్పటికే 167మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.
రుణమాఫీ, దళితులకు భూమి, ఎస్సీ మైనార్టీ రిజర్వేషన్లు.. ఇంకా తదితర హామీలను గతంలో ప్రకటించిన కేసీఆర్.. ఇంతవరకు అమలు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ఈ లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదనే ఇతర పార్టీనాయకుల ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ గతంలో ఏవో చెప్పి ప్రజలను మభ్యపెట్టి.. ఇప్పుడు వారికి నిట్టనిలువునా ద్రోహం చేస్తున్నారని.. ఇటువంటి నాయకులు సీఎం పీఠం మీద వున్నంతవరకు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రజలు కేసీఆర్ తో చాలా విసిగిపోయారని చెప్పిన పొన్నాల... హిట్లర్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more