Projects in telangana and ap full with water

projects, telangana, andhrapradesh, latest news, rivers, rains, nagarjuna sagar, srisailam, dhavaleswaram, rajamundry, jurala project

projects in telangana and andhrapradesh full with rain water : rain water fulfilled gap in projects of telugu states

నీటితో నిండిన జలాశయాలు

Posted: 09/07/2014 11:26 AM IST
Projects in telangana and ap full with water

వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో తెలంగాణ, ఏపీల్లో డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏపీలోని శ్రీశైలం జలాశయంకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలంలో ప్రస్తుతం 884.90 నీటిమట్టం ఉంది. ఇక శ్రీశైలం  నుంచి వస్తున్న వరద నీటితో సాగర్ లో  కూడా నీటిమట్టం పెరుగుతోంది. సాగర్ లో ప్రస్తుతం 574అడుగులకు పైగా నీరుంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. నీటి మట్టం పెరగటంతో అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇక ఖమ్మం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుమ్మడవల్లిలోని పెదవాగు ఉప్పొంగి ప్రవమిస్తోంది. అటు కిన్నెరసాని రిజర్వాయర్ కు భారీగా వరద వస్తోంది. ఏజన్సీలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కంకల, రాచపల్లి, పాలెం వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అటు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార జలాశయంలో కూడా నీటి ఉదృతి కొనసాగుతోంది.

వర్షాకాలం పూర్తవుతుండగా వర్షం పడుతుండటంతో కాలం పోయిందని బాధపడాలో లేక.., వచ్చే వేసవికి కరువు తక్కువగా ఉంటుందని సంతోపడాలో  తెలియటం లేదని రైతులు అంటున్నారు. అటు భూగర్బ జలాలను నమ్ముకుని వేసిన పంటలు ఈ అకాల వర్షాలతో దెబ్బతింటున్నాయి. దీంతో ఇన్నాళ్ళు వర్షాలు లేక బాధపడ్డ రైతులు ఇప్పుడు వర్షాలతో నష్టపోతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dams  water  rains  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more