Tribal man changed gender in mumbai

transgendered, tribal man suresh gender, tribal man changed his gender to female, tribal family, karimnagar district

tribal man changed gender in mumbai

అబ్బాయిగా పారిపోయాడు.. అమ్మాయిగా తిరిగొచ్చాడు!

Posted: 09/06/2014 02:36 PM IST
Tribal man changed gender in mumbai

(Image source from: tribal man changed gender in mumbai)

పుట్టుకతోనే కొందరు అబ్బాయిలు జన్యువుల ప్రభావం వల్ల అమ్మాయిలుగా లేదా హిజ్రాలుగా మారిపోతారన్న విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతకాలంలో వున్న అబ్బాయిలు.. అమ్మాయిలుగా తమనుతాము మార్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. పాశ్చాత్తదేశాల నుంచి వచ్చిన ఈ సంస్కృతి.. నేడు మన భారతదేశంలో కూడా బాగానే పెరిగిపోయింది. అమ్మాయిల హావభావాల ఆకర్షణకు గురయి.. పరిశోధనల ద్వారా అబ్బాయిలు లింగమార్పిళ్లు చేయించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు ముఖ్యంగా మహానగరాల్లోనే చోటుచేసుకుంటుంటాయి. అయితే ఇక్కడ తెలుగు అబ్బాయి, అమ్మాయిగా మారిపోవడం సంచలనాన్నే సృష్టించాడు. పెళ్లికూడా చేసుకునే సజావుగా కాలాన్ని గడుపుతున్న అతను.. హఠాత్తుగా అమ్మాయిగా మారడంతో అతని కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్లారెడ్డి మండలం వీర్నపల్లికి చెందిన లకావత్ శశికళ, రామచంద్రం దంపతుల రెండో సంతానం అయిన లకావత్ సురేష్.. ఇంటినుంచి పారిపోయి పదినెలల తర్వాత మగువగా మారి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన కుటుంబంలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సురేష్ కు పెళ్లి చేసేందుకు అతని కుటుంబసభ్యులు సంబంధాలు చూశారు. కానీ అతడికి ఆ పెళ్లి ఇష్టం లేదని కుటుంబీకులతో వాదించినప్పటికీ.. వారు వినకుండా ఇతని పెళ్లి కార్యక్రమాలను సిద్ధం చేశారు. దీంతో కుటుంబసభ్యుల బలవంతం మేరకు అతడు పెళ్లికి అంగీకరించాడు. రెండేళ్లక్రితం అదే మండలం రాచర్లగుండారానికి చెందిన ఓ యువతితో అతని వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగినా.. అప్పుడప్పుడు చిన్నచిన్న తగాదాలు జరిగేవి. ఈ క్రమంలోనే సురేష్ ను అతడి అన్న రాజు కొట్టాడు. దీంతో కుంగిపోయిన సురేష్.. నవంబర్ 21వ తేదీన ఇంటినుంచి పారిపోయాడు. దీంతో తన కుమారుడు కనిపించడం లేదంటూ శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక సురేష్ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అలా ఇంటినుంచి పారిపోయిన సురేష్ నేరుగా ముంబైకి చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్లపాటు జీవనం కొనసాగించిన అతను లింగమార్పిడి చేయించుకుని.. లతగా పేరు మార్చుకున్నాడు. మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతంలో వున్న తోటివారితో కలిసిపోయాడు. ఇదిలావుండగా.. ఓ కేసు నిమిత్తం సురేష్ (లత) ఒక హిజ్రాతో కలిసి వేములవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. విధివైపరీత్యమేమో గానీ.. అదే సమయంలో శశికళ (సరేష్ తల్లి) ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు వేములవాడకు వచ్చింది. అక్కడ తల్లిని చూసిన సురేష్.. ఆమెను పలకరించాడు. కొడుకు అమ్మాయిగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే కొడుకు తిరిగొచ్చాడన్న ఆనందంతో ఆమె గతంలో పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన భర్త వచ్చాడని తెలుసుకున్న భార్య పోలీస్ స్టేషన్ కు చేరుకోగా... అక్కడ భర్త స్థానంలో మగువ దర్శనమివ్వడంతో కన్నీటి పర్యంతమైంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tribals  karimnagar district  lakavat suresh  lakavath family members  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more