ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో, కొన్నేళ్లుగా అక్రమంగా ప్రభుత్వ సబ్సిడీ పొందుతున్న తెల్లదొరల గుట్టు బట్టబయలు కానుండడంతో వీరంతా బెంబేలెత్తుతున్నారు.
ముందుగా బోగస్ రేషన్ కార్డులు, బోగస్ పెన్షన్లు ఏరివేయాలని సర్కార్ భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే డేటా కంప్యూటరీకరించగానే గ్రామాల వారీగా అధికారులు పేదల జాబితాను రూపొందిస్తారు. ఈ మేరకు పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 13 లక్షలకు పైగా తెల్లరేషన్ కార్డులు ఉండగా ఇందులో లక్షన్నరకు పైగా ఇటీవల ఏరివేశారు. సర్వే డేటా ఆధారంగా ధనవంతులను గుర్తించి వారిపై వేటు వేస్తారు.
జిల్లాలో గడిచిన నెల రోజుల్లో లక్షన్నరకుపైగా బోగస్ తెల్లరేషన్ కార్డులను ఏరివేసిన విషయం తెలిసిందే. ఇందులో అధికంగా రేషన్ డీలర్ల దగ్గర ఉన్నవాటినే స్వాధీనం చేసుకున్నారు. ఇక ధనవంతులు, అర్హత లేని వారు కూడా పెద్ద సంఖ్యలో తెల్లరేషన్ కార్డులు పొందారు. వీరి సంఖ్య మూడు లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఇటీవల జరిగిన కుటుంబ సమగ్ర సర్వేలో ఇటువంటి వారి జాతాకాలన్నీ బట్టబయలయ్యాయి.
కోటీశ్వరులు కూడా తెల్లరేషన్ కార్డు వాడుకుంటున్నారు. తాము పేదలమని చెప్పుకుంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వ సబ్సిడీలను వాడుకుంటున్నారు. కొందరు అర్హులైన పేదలకు అసలు రేషన్ కార్డులే లేవు. ఇలాంటి కుటుంబాలు జిల్లాలో లక్షన్నర వరకు ఉంటాయని అంచనా. బోగస్ తెల్లరేషన్ కార్డులన్నీ రద్దు చేసి అర్హులైన పేదలకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన సర్వే డేటా ఆధారంగా అనర్హులను నిర్ధాక్షిణ్యంగా ఏరివేసేందుకు సర్కార్ వ్యూహం రచిస్తోంది.
ఇటీవల సమగ్ర సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు చర, స్థిరాస్తులు, వాహనాలు, ఏసీలు, ఇంట్లో జంతువుల వివరాలను కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే కుటుంబాల సంఖ్య దాదాపు అయిదు లక్షలకు పైగా పెరిగింది. గతంలో 14.5 లక్షల ఉన్న కుటుంబాల సంఖ్య ఇప్పుడు 19 లక్షకు పైగా నమోదైంది. ఇంకా సర్వే చేయాల్సిన కుటుంబాలు కూడా ఉన్నాయి. మొత్తం కుటుంబాల డేటాను అధికారులు కంప్యూటరీకరిస్తున్నారు. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీని ఆధారంగా జిల్లాలో అసలు పేదలు ఎవరూ? ధనవంతులెవరనేది తేలిపోతుంది. దీని ఆధారంగా సంక్షేమ పథకాలను రూపకల్పన చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more