ఇది పరిశోధనాత్మకంగా నిరూపించబడిన నివేదిక అయితే ఛస్తే మాత్రం కాదు! అలాగే హెచ్చరిక కూడా కాదు. మన భారతదేశంలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ కదండి... అందులో ఇది కూడా ఒక భాగమే! ఎవరో ఎక్కడో ఏదో వాగుగుంటూ వెళ్తుంటే.. అతను చెప్పిన మాటలు విని నిజమేనని భావించి ఒకరికొకరు చెప్పుకున్నారు. అది అలాగే మెల్లగా పాకి వైరస్ లా జిల్లా మొత్తం వ్యాప్తి చెందింది. అంతే! రాత్రి పడుకుంటే చనిపోతారనే వదంతులు రావడంతో జనాలంతా రాత్రంతా జాగారం చేశారు. ఇది సంఘటన జరిగింది మరెక్కడో కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో జరిగింది.
ఈ వదంతులు రాగానే నిజమేనని భావించిన తెలుగు ప్రజలు.. భయాందోళనలకు గురై రాత్రంతా జాగారం చేశారు. ఇంకొంమతందైతే మరీ విచిత్రంగా తమ ఇళ్లను వదిలి, వీధుల్లోనే సరదాగా గడిపారు. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ రాత్రంతా మేలుకొని, ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు. మరికొంతమంది ఎక్కడ చనిపోతామోనన్న భయంతోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎవరైతే పడుకుంటున్నారో వారిని తట్టి మరీ లేపారు. ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వున్న ప్రజలు చేయగా... వరంగల్ జిల్లాలోని ములుగు, రేగొండ, ఖానాపూర్, మరిపెడ, కురవి, డోర్నకల్, నరసింహులపేట తదితర మండలాల్లో వదంతులు వ్యాపించాయి. అలాగే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు, దామచర్ల, నేరేడుచర్ల, నాంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలాల్లో ఈ వదంతులు వ్యాపించాయి.
మొదట వారంతా జాగారం చేయడాన్ని చూసి ‘‘బహుశా వీరంతా పురాతన కాలంనాటి ఆచారాల నేపథ్యంలో ఇలా జాగారం చేసి వుండొచ్చు’’ అని భావించి వారిని అడిగితే... అసలు నిజమెంటో ఆ తర్వాత తెలిసింది. రానురాను మన దేశంలో మూఢనమ్మకాల ప్రబలం పెరిగిపోతోందికానీ.. అరికట్టడం మాత్రం సాధ్యం కావడం లేదు. మరి ఇలా ఇంకెన్నాళ్లు ఈ విధంగా జరుగుతూనే వుంటుందో! ఇదిలావుండగా... తెలంగాణ రాష్ట్రంలో గతరోజుల నుంచి భూకంప సంకేతాలు వస్తున్నట్టు వాతావరణ శాఖలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యం అప్రమత్తంగా వుండాల్సిందిగా హెచ్చిరికలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో రాత్రి సమయంలో ఎక్కడ భూకంపం వస్తుందోనన్న భయంతో ప్రజలు ఇలా జాగారం చేసి వుండవచ్చని కొంతమంది తెలుపుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more