ప్రభుత్వ పధకాల అమలు, విభజన కేటాయింపులపై మీకు మీరే మాకు మేమే అని స్పష్టం చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. విభజన తర్వాత ఏపీతో తమకేమి సంబంధం లేదని అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు గత ఉమ్మడి ప్రభుత్వాలు అమలు చేసిన పధకాలను కూడా తొలగించటమో.., పేరు మార్చటమో చేస్తున్నారు. రాష్ర్ట విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా మారిపోయింది. ఏపికి కొత్త రాజధాని ఎంపిక కోసం పెద్ద కసరత్తే జరుగుతోంది. ప్రపంచస్థాయిలో ఉండాలన్న బాబు కోరికకు తగ్గట్లు అన్ని ప్రాంతాల పరిశీలన జరుగుతోంది. అయితే ఏపీతో తమకేమి సంబంధం లేదనే కేసీఆర్ ఇప్పుడి రాజధాని ఎంపికలో వేలు పెట్టారు. క్యాపిటల్ ఎంపికలో బాబుకు కేసీఆర్ సలహాలు ఇస్తున్నారు. కేసీఆర్ ఉచిత సలహాపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆదివారం రోజు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సమావేశం అయ్యారు. వీరి మద్య పాలనలో వివాదాస్పదంగా ఉన్న ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయి. వీటిని పరిష్కరించుకోవాలని ఇద్దరు చంద్రులూ నిర్ణయించుకున్నారు. ఈ సందర్బంగా ఒకరి మంచి చెడు మరొకరు అడిగి తెలుసుకున్నారు. అలా ఏపీ క్యాపిటల్ ఎంపిక ఎంత వరకు వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించగా.., స్టిల్ ఆన్ సెలక్షన్ ప్రాసెస్ అని బాబు బదులిచ్చినట్లు సమాచారం. ఏమి అనుకోనంటే ఎంపికలో తనదో సలహా అని కేసీఆర్ సజిషన్ ఇచ్చారు. రాజధానిని మంగళగిరి, అమరావతి పట్టణాల మద్య ఉంటే బాగుంటుందని సూచించారు. ఇందుకు ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఉత్తరం నుంచి నదులు ప్రవహించే నగరాలు ఎంతో అబివృద్ధి చెందాయని.., ఏపీ కూడా అలా అభివృద్ధి చెందాలంటే తాను సూచించినట్లు చేయాలన్నారు.
ఇప్పటికే రాజధాని ఎంపికపై రోజుకో వార్తలు వస్తున్నాయి. విజయవాడలో అని ఒక మంత్రి చెప్తే.., కాదు కర్నూలులో అని మరొకరు ప్రకటిస్తారు. రెండూ కాదు మరో చోట అని ఇంకొకరు స్టేట్ మెంట్లు ఇస్తు గందరగోళం సృష్టిస్తున్నారు. వీరందరి నోళ్ళకు తాళ: వేసేలా విజయవాడను తాత్కాలిక రాజధాని చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచే పదేళ్ళ పాలన జరగనుంది. ఆ తర్వాతది శివరామకృష్ణుడు ఎలా చెప్తే అలా అంటున్నారు. ఈ లోగా కేసీఆర్ కొత్త సలహా ఇవ్వటంతో బాబు దీనిపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కర్నూలును రాజధాని చేయాలంటున్న సీమ నేతలు కేసీఆర్ సజీషన్ ప మండిపడుతున్నారు. రాష్ర్టాన్ని విభజించి హైదరాబాద్ కు దూరం చేసిన కేసీఆర్.., ఇప్పుడు రాజధాని దక్కకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. సీమలోని సామాన్య జనం సైతం కేసీఆర్ సలహాపై గుర్రుగా ఉన్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more