ఉమ్మడి రాష్ర్ట పధకాలను తొలగిస్తున్న తెలంగాణ సీఎం ఇప్పుడు మరో పధకాన్ని రద్దు చేశారు. రాష్ర్టంలో ఫీజు రి ఎంబర్స్ మెంట్ పధకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి రాష్ర్టంలో వైఎస్ ప్రారంభించిన ఈ పధకం ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఈ పధకం కొనసాగుతుందని రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు గతంలో స్పష్టం చేశారు. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఫీజు రి ఎంబర్స్ మెంట్ కొనసాగిస్తున్నా.., తెలంగాణ ప్రభుత్వం మాత్రం పధకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పధకాన్ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఏపీ సీఎంతో చర్చలు జరిగిన కొద్ది సేపటికే కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే స్థానికతపై దుమారం రేగుతుండగా.., ఈ పధకం రద్దు పేరుతో మరో వివాదాన్ని నెత్తినేసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశం అయ్యారు. విభజన తర్వాత వీరిద్దరి మద్య జరిగిన తొలి ములాఖత్ ఇదే. గవర్నర్ చొరవతో రాజ్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ర్టాల మద్య ఉన్న సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల విభజన వంటి అంశాలకు పరిష్కారం దిశగా చర్చలు జరిగినా.., ప్రధానమైన ఫీజు రి ఎంబర్స్ మెంట్ పై మాత్రం స్పష్టత రాలేదు. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ స్థానికత నిర్ధారణ తెలంగాణ సర్కారుదే అని బాబుకు కుండబద్దలు కొట్టారు. చివరకు విద్యార్థులకు 58:42 ప్రకారంగా ఫీజులు చెల్లించుకుందామన్నా ససేమిరా అన్నారు. మీకు మీరే.., మాకు మేమే అని స్పష్టం చేశారు. ఏ రాష్ర్ట విద్యార్థులకు ఆ రాష్ర్ట ప్రభుత్వమే ఫీజులు చెల్లించుకోవాలని కేసీఆర్ బాబుకు చెప్పారు.
ఇక ఫీజు రి ఎంబర్స్ మెంట్ పధకాన్ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఈ పధకం స్థానంలో కొత్తగా ఫాస్ట్ పధకం తీసుకొస్తామన్నారు. ఈ పధకంతో అర్హులైన స్టూడెంట్స్ కు ట్యూషన్ ఫీజు చెల్లిస్తామని చెప్పారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. చదువు చెప్పాలనే ఉద్దేశ్యంతో కాకుండా కేవలం పీజుల కోసమే కొన్ని కాలేజీలు పుట్టుకొస్తున్నాయి.., అలాంటి కాలేజీలను అడ్డుకోవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఎంతో విలువైన ఇంజనీరింగ్ కోర్సు ఇప్పుడు పనికిరానిదయిందని.., నాణ్యత లోపించి విద్యార్థులకు ఉపాధి చూపించలేకపోతుందన్నారు. అందువల్లనే అడ్డగోలు చెల్లింపులకు అడ్డుకట్ట వేసి ఫాస్ట్ పధకంతో వేగంగా.., అర్హులకే ఫీజులు చెల్లిస్తామని కేసీఆర్ చెప్పారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more