Pak army cease fire on indian posts in kashmir

pakisthan army, pakisthan firing, indian army, indian armed force, india border, india pakisthan border, indian army chief, defence, nawaz sharif, modi, modi kashmir tour, modi comments on pakistha, nawaz sharif india tour

pak army cease fire on indidian posts in kashmir on tuesday midnight : indian army answered with guns for pakisthan firing on tuesday midnight

కుక్కతోకలా పాక్ బుద్ధి...!!

Posted: 08/13/2014 09:52 AM IST
Pak army cease fire on indian posts in kashmir

ఎంత చేసినా కుక్క తోక వంకర పోదు. అది జన్మత: వచ్చింది. పాక్ నేతల బుద్ధి కూడా ఎన్ని చెప్పినా మారదు. ఎందుకంటే వారు పుట్టడంతోనే భారత్ ను వ్యతిరేకించటం మొదలుపెడతారు. ఇక పాక్ ఆర్మీ అయితే ఇందులో ఒక అడుగు ముందుంది. ప్రధాని మోడి హెచ్చరికలు చేసి ఒకరోజైనా గడవక ముందే భారత సరిహద్దుపై పాక్ సైన్యం విరుచుకుపడింది. ఓ వైపు శాంతి చర్చలు జరగాలని, భారత్ తో స్నేహంగా ఉంటామని పైకి చెప్తూ వెనక నుంచి దుశ్సాసన కుట్రలు చేయటంలో దిట్ట. సరిహద్దులో శాంతి కోరుకుంటున్నామని పాక్ ప్రభుత్వం చెప్తుండగా.., ఆ దేశ ఆర్మీ మాత్రం కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వారి బుద్ధి మానదు. ఇరుదేశాల మద్య గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం సరిహద్దులో కాల్పుల విరమణ ఒఫ్పందం అమల్లో ఉంది. అయితేనేం అవి కాగితపు సంతకాలు తమను కంట్రోల్ చేయలేవన్నట్లుగా దాయాది సైన్యం వ్యవహరిస్తోంది.

మంగళవారం కాశ్మీర్ లోని కార్గిల్ లో పర్యటించిన మోడి.., పాక్ ను సూటిగా హెచ్చరించారు. ఆ దేశ ఆర్మీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ఆ దేశానికి యుద్ధం చేతకాక వెన్నుపోటు దాడులు చేస్తోందని విమర్శించారు. పాక్ ఆర్మీ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మంచి కోరుకునే వారు, శాంతి కాముకులు కాల్పులు జరపరని హితవు పలికారు. ఎన్ని చెప్తేనేం వారి వంకర బుద్ధి మానలేదు. సరిహద్దులోని మన స్థావరాలపై దొంగదెబ్బకు ప్రయత్నించింది. మోడి చెప్పినట్లు పగలు భారత్ ను ఎదుర్కోవటం చేతకాక.., అర్ధరాత్రి దాడికి దిగింది సరిగ్గా గత అర్ధరాత్రి 11:55కు మొదలైన కాల్పులు 1గంటల వరకు జరిగాయి. ఆర్.ఎస్. పురాలోని పిటల్ పోస్ట్, కకు డే కోటాయ్, టెంట్ పోస్టులపై తూటాల వర్షం కురిపించింది. అప్పటికి కసితీరలేదన్నట్లుగా తెల్లవారుజామున మూడు గంటలకు కూడా మరోసారి ఫైరింగ్ మొదలుపెట్టింది.

అయితే పాక్ బుద్ధి తెలిసిన మన జవాన్లు ఎప్పుడూ అలర్ట్ గా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దేశ రక్షణ కోసం అణుక్షణం పహారా కాసే వీరి ముందు పాక్ కుప్పిగంతులు సాగలేదు. అర్దరాత్రి కాల్పులు జరిపినా.., అలర్టయిన భారత సైన్యం దెబ్బకు దెబ్బ అన్నట్లు..., దేశంపై దండెత్తుతున్న వారిపై తుపాకులు గురిపెట్టింది. దీంతో ఏమి చేయలేక కలుగుల్లోకి వెళ్లిపోయారు పాక్ సైనికులు. దేశంలో దాడులు చేసేందుకు భారత సరిహద్దును దాటుకుని వచ్చేవారికి అన్నివిధాలా పాక్ ఆర్మీ సహాయం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా గెరిల్లాలను తయారు చేస్తోందని ఆర్మీ ఇంటలిజెన్స్ సమాచారం సేకరించింది. సరిహద్దులో అణుక్షణం అప్రమత్తంగా ఉండాలని జవాన్లను హెచ్చరించింది. అయినా మన పాలకులు శాంతి, శాంతి అని ఆపుతుండటం వల్ల ఆర్మీ ఆలోచిస్తోంది తప్ప.., ఒక్కసారి అనుమతిస్తే, భారత్ అనే పేరు పలకటానికి కూడా వణికిపోయేలా పాక్ కు బుద్ది చెప్పగలరు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakisthan cease fire  indian army  border  modi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more