అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందట. ఈ నానుడి తెలంగాణ ప్రభుత్వానికిప్పుడు సరిపోతుంది. ఎంసెట్ కౌన్సిలంగ్ పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిన సుప్రీం కోర్టు, ఇవాళ మరోసారి చీవాట్లు పెట్టినంత పని చేసింది. ఆగస్టు 31లోపు కౌన్సిలింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కౌన్సిలింగ్ నిర్వహించేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని తెలంగాణ తరపు లాయరు వాదించారు. అయితే ఒక్కరోజు కూడా గడువు పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
గడువులోపు కౌన్సిలింగ్ పూర్తి చేయకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే కౌన్సిలింగ్ ఆలస్యమైందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫీజు రి ఎంబర్స్ మెంట్ తర్వాత తేల్చుకుందాం లేదా నిబంధన ప్రకారం 58శాతం చెల్లిస్తామని ఏపీ చెప్తోంది. అయినా ఎవరి మాటా వినని సీతయ్యలా కేసీఆర్ వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు సుప్రీం దగ్గరకు తీసుకుని మొట్టికాయలు వేయటంతో, కౌన్సిలింగ్ నిర్వహించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది తెలంగాణ సర్కారుకు.
విభజన చట్టం ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించమంటున్నామని.., తామేమి కొత్త నిబంధనలు తేవటం లేదని న్యాయస్థానం చెప్తోంది. చట్టానికి లోబడి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రవేశాలపై కూడా విభజన చట్టంలో సూచించిన అంశాలు, మార్గదర్శకాలు పరిగణలోకి వస్తాయని పేర్కొంది.
స్థానికతపై స్పందించని సుప్రీం
కౌన్సిలింగ్ తేదీలో మార్పు లేదని చెప్పిన సుప్రీం కోర్టు.., వివాదానికి కారణం అయిన స్థానికత అంశంపై మాత్రం స్పందిచలేదు. 1956 తర్వాత తెలంగాణకు వచ్చిన వారికి ఫీజు రి ఎంబర్స్ మెంట్ లేదని కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటున్నారు మరి. అయితే ఈ అంశంపై న్యాయస్థానం స్పందించలేదు. మరి స్థానికతను పక్కనబెట్టి కౌన్సిలింగ్ నిర్వహిస్తారా? లేక చింత చచ్చినా పులుపు చావదన్నట్లు ఇంత జరిగినా మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్తారా అనేది వెయిట్ అండ్ సీ.
అదేంటో సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదం అవుతోంది. విద్యుత్ పంపిణీ, స్థానికత, ఫీజు రి ఎంబర్స్ మెంట్, ఎంసెట్ కౌన్సిలింగ్, అక్రమ కట్టడాల కూల్చివేత ఇలా ఒకటేమిటి ప్రతీది వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడయితే సుప్రీం స్పష్టంగా కౌన్సిలింగ్ జరపాలని చెప్పింది. ఈ నిర్ణయంపై ఏపీ సర్కారు సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇకనైనా కేసీఆర్ పంతాలకు పోకుండా విద్యార్థుల బాగుకోరి నిర్ణయం తీసుకోవాలని ఏపీ మంత్రులు అంటున్నారు.
RK
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more