ఇంటి వరండాలో ఆనందంగా ఆడుకుంటున్న ఓ ఎనిమిది నెలల పాప జీవితం కోడిపుంజు దాడి చేయడంతో మృతి చెందింది. దీంతో ఇంటి మహాలక్ష్మీ చనిపోయిందని ఆ కుటుంబసభ్యులు భోరుమంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెంలో నివాసం వుంటున్న కొంపల్లి సైదులు, గీతలకు ఎనిమిది నెలలక్రితం మొదటి సంతానంగా జన్మించిన ఈ పాప.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
పాప పేరు జాహ్నవి. ఈ పాప తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో వారు కోళ్లను పెంచుకుంటున్నారు. గురువారం ఉదయం తల్లి పాపను ఇండి వరండాలో పడుకోబెట్టి పనులు చేసుకోవడంలో నిమగ్నమయిపోయింది. ఆ సమయంలోనే కోడి పాప వద్దకు వచ్చి తలపై బలంగా పొడవడంతో తలకు తీవ్ర గాయమయి రక్తస్రావం ఎక్కువైంది. ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆ పాపను తీసుకుని స్థానిక వైద్యుని దగ్గరకు ప్రథమ చికిత్స చేయించారు. అయితే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం ఇప్పించాల్సిందిగా సదరు డాక్టరు కోరగా.. వారు వెంటనే నల్లగొండలోని ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే శనివారం జాహ్నవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆ పాపను వెంటనే హైదరాబాద్ కు తీసుకువెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆ పాపను హైదరాబాద్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు జాహ్నవి ప్రాణాలను కాపడటానికి ఎంత ప్రయత్నించినా... ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆ అమ్మాయి తుదిశ్వాసను విడిచింది. అయితే తల్లిదండ్రులు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే జాహ్నవి ప్రాణాలను విడిచిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more