యావత్తు ప్రపంచంలోనే ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గా పేరుగాంచిన ఫేస్ బుక్ కు రానురాను కష్టాలు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చూస్తుంటే ప్రస్తుతం ఫేస్ బుక్ కు రోజులు అంతగా బాగున్నట్లు లేవని తెలుస్తోంది. కొంతమంది నెటిజన్లు ఏదోవిధంగా దీనిపై కేసుల మీద కేసులు వేస్తూనే వున్నారు. ఇదివరకే ఎవరో ఒక వ్యక్తి తనకు సంబంధించి అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తున్నాడని.. ఆ చిత్రాలను వెంటనే తొలగించాల్సిందిగా ఫేస్ బుక్ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని ఓ మహిళ దాదాపు 725 కోట్ల రూపాయల దావా వేసిన విషయం తెలిసిందే!
ఇప్పుడు తాజాగా దీనిపై ఆస్ట్రియాకు చెందిన న్యాయవిద్యార్థి మాక్సిమలియిన్ ష్రెమ్స్ ఫేస్ బుక్ పై మరో కేసు వేశాడు. యూజర్ల వ్యక్తిగత రహస్యాలను ఫేస్ బుక్ ఉల్లంఘించిందని అతను కేసు వేయడమేగాక.. ప్రపంచంలో వున్న మిగతావాళ్లంతా ఈ పోరాటంలో తనతో కలిసి పాల్గొనాలంటూ కోరాడు. ఎన్ఎస్ఏ నిఘా సంస్థవారి ‘‘ప్రిజమ్’’ అనే కార్యక్రమంలో కోసం ఫేస్ బుక్ లక్షలాది యూజర్ల వ్యక్తిగత విషయాలను ఇచ్చేసిందని ష్రెమ్స్ కేసు వేశాడు. ‘‘లైక్’’ బటన్ ద్వారా థర్డ్ పార్టీ వెబ్ సైట్లకు చెందిన యూజర్లను కూడా ట్రాక్ చేస్తోందని, యూజర్లు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఇది తెలుసుకుంటోందని అతని ఆరోపించాడు. దీంతో అతను ఫేస్ బుక్ డేటా ప్రైవసీ చట్టాలను ఉల్లంఘిస్తోందని అతను ఆరోపిస్తూ కేసు వేశాడు.
ఆస్ట్రియాలో వున్న చాలామంది విద్యార్థులు కూడా ష్రెమ్ లో కలిసి ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కానీ.. జర్మనీకి చెందిన రోనాల్డ్ ప్రోజెస్ ఫైనాన్స్ అనే ఒక సంస్థ ఈ పోరాటానికి కావల్సిన ఖర్చులను భరించడానికి ముందు వస్తోంది. ఒకవేళ కేసు ఓడిపోతే వారికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ.. గెలిస్తే మాత్రం అందులో 20 శాతం ఇవ్వాల్సి వుంటోంది. ష్రెమ్ ఫేస్ బుక్ మీద కేసు వేస్తూనే.. ఇంకా చాలా వెబ్ సైట్లు యూజర్ల వ్యక్తిగత రహస్యాలను దొంగలిస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ పోరాటంలో ఇతనితోపాటు దాదాపు 2,500 మంది విద్యార్థులు కూడా చేయూతనిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more