Telangana congress ministers meeting

telangana congress ministers fighting among themselves for cm seat, telangana congress ministers, telangana congress ministers meeting, telangana congress core committee meeting, sonia gandhi latest news, sonia gandhi with telangana congress leaders, telangana congress ministers, telangana pcc ponnala lakshmaiah latest news, telangana congress ministers fought among themselves for cm seat

telangana congress ministers fighting among themselves for cm seat

సీఎం సీటుకోసం దొబ్బులాడుకున్న కాంగ్రెస్ నేతలు

Posted: 07/17/2014 03:42 PM IST
Telangana congress ministers meeting

సార్వత్రిక ఎన్నికలు జరిగిపోయి నెలరోజులయ్యింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో రెండు కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. తమను తాము నిరూపించుకోవడానికి రెండు రాష్ట్రాల సీఎంలు అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి ఘోరంగా పరాజయం పాలయిన కాంగ్రెస్ నేతలు సీఎం సీటు ఎందుకు గొడవ పడుతున్నారబ్బా..? అని తీవ్రంగా ఆలోచించుకుంటున్నారా..!? అయితే మీరు పప్పులో కాలేసినట్టే!

అసలు విషయం ఏమిటంటే... తెలంగాణలో వున్న కాంగ్రెస్ నేతలు తమ సీనియర్ నేతలపై మండిపడుతున్నారు. అధికారం చేతిలో వున్నంతకాలం కేవలం ఒకరికొకరు సీఎం పదవి కోసం కొట్టుకున్నారే తప్ప... ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా, పార్టీని పట్టించకోకుండా కుంభకోణాలకు పాల్పడ్డారని ఒకరికొకరు కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం కావడానికి కారణం సీనియర్ నేతలే అంటూ నాయకులు ఒకరిమీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎవరికి వారుగా కాంగ్రెస్ సీనియర్ నేతలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణాలో గుర్తింపు పొందినా.. దానిని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు సీనియర్ నాయకులు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కేవలం సీఎం కుర్చీ కోసం లాబీయింగ్ పై దృష్టి సారించారే తప్ప.. పార్టీని పట్టించుకున్న ప్రణాళికలే లేవని వారన్నారు.

సాక్షాత్తూ సోనియాగాంధీ నిర్వహించిన సభ కూడా తెలంగాణాలో విఫలం అయిందంటే దానికి కేవలం సీనియర్ నాయకులు, మాజీ మంత్రులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని వైఫల్యాలు ఎదురయినా ఎవరికీ బుద్ధి రాలేదన్న నాయకులు... ఇప్పుడు పొన్నాలను పీసీసీ పీఠం నుంచి దించే ప్రయత్నంలో వున్నారే తప్ప.. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసే ఆలోచనలు చేయడం లేదని వారు ఆరోపించుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, మంచి నాయకత్వంతో ప్రజల మధ్యలోకి చేరి, వారికి అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే.. తిరిగి పార్టీని పటిష్టం చేసుకోవచ్చని చివరికి సలహాలు ఇచ్చుకుంటున్నారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more