రాజకీయాలలో ఎంతవరకు లాగగలిగితే అంతవరకు లాగటమే కానీ అనుభవాల్లోంచి గుణపాఠాలు నేర్చుకోవటమనేది ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రుజువుచేసారు.
ఆయనెలాగూ ఢిల్లీ పీఠాన్ని వదిలిపెట్టేసారు. రాష్ట్రపతి పాలన జరుగుతోంది. రాష్ట్రం నుంచి ఏకంగా జాతీయస్థాయిలోకి ఎదుగుదామనుకున్నారు కానీ అది కుదరలేదు. ఢిల్లీలాంటి పరిమిత పరిధిలో గడించిన గుడ్ విల్ దేశవ్యాప్తంగా ఆయన దక్కించుకోలేకపోయారు. మళ్ళీ ఢిల్లీలో అధికారం గురించి తపన పడుతూ మాట్లాడుతున్నారు. మళ్ళీ అంతలో ఏం మార్పు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటం కోసం పావులు కదుపుతోందన్న వార్త రెండు రోజులుగా ప్రచారంలో ఉంది.
నిజానికి ఢిల్లీలో భాజపాకే ఎక్కువ మెజారిటీ వచ్చినా, రెండవ స్థానంలో ఉన్న కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించటమైతే చేసారు కానీ 49 రోజులలో దిగిపోయారు కూడా. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతిపాలన విధించటం జరిగింది. ఇప్పుడు మరోసారి భాజపా ఢిల్లీ లో అధికారాన్ని స్థాపిద్దామని చూస్తోందన్న విషయం కేజ్రీవాల్ ని కలవరపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆయన ఏకంగా రేడియోలో ప్రకటనలే ఇచ్చేస్తున్నారు భాజపా ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నం చేస్తోందని. అది కూడా 20 కోట్ల రూపాయలకు. దానితోపాటు ట్విట్టర్లో కూడా ఆరోపణలు కొనసాగిస్తున్నారు.
లోగడ భాజపాతో తలపడి జాతీయ ఎన్నికలలో ఓడిపోవటమే కాకుండా, భాజపా నాయకుల మీద అవినీతి ఆరోపణలను బహిరంగంగా చేసి పరువునష్టం దావాలను ఎదుర్కుని జైలు జీవితాన్ని కూడా చవిచూసారు. అయినా నిరాధారమైన అంటే, ఆయన నిరూపించలేని ఆరోపణలను మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. పోనీ తన పార్టీ ఎమ్మల్యేలను ప్రలోభపెట్టటానికి చూస్తే అది తనకు తెలిస్తే సాక్ష్యాధారాలున్నాయని అనుకోవచ్చు. భాజపా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నదంటూ కేజ్రీవాల్ రేడియోలో ప్రకటనల రూపంలోను, ట్విట్టర్లో వ్యాఖ్యలతోనూ సంచలనాన్ని సృష్టిస్తున్నారు.
నిండా మునిగిన తర్వాత చలేమిటన్నట్లు ఇప్పటికే పరువు నష్టం దావాలు నడుస్తున్నాయి కదా ఇంకా ఏమౌతుందిలే అన్న ధీమా కూడా కావొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more