Bjp leaders controversial comments on arvind kejriwal

Bjp leaders controversial comments on arvind kejriwal, kejriwal latest news, bjp party comments on kejriwal, kejriwal comments on bjp party, kejriwal comments on narendra modi, bjp party leaders comments on aravind kejriwal, aravind kejriwal latest news, pm narendra modi latest news

Bjp party leaders controversial comments on former cm and aap party president kejriwal

కేజ్రీవాల్ కు మెంటల్ చెకప్ చేయాలట!

Posted: 07/16/2014 03:55 PM IST
Bjp leaders controversial comments on arvind kejriwal

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈమధ్య కాలంలో పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తున్నాడని చాలామంది రాజకీయ నాయకులు తమ నోటికొచ్చినట్టు తిట్టిపారేశారు. అనవసరంగా ప్రజలను మభ్యపెట్టి, వారిని మోసం చేశాడని... పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జనాలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా నరేంద్రమోడీతో అనవసరంగా గొడవలకు దిగాడని ఈయన మీద విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ నగరవాసులు కూడా కేజ్రీవాల్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు.

తన మీద వస్తున్న వ్యతిరేక భావాన్ని తుడుచుకోవడానికి కేజ్రీవాల్ కూడా చాలానే ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు ఏం చేయాలో దిక్కుతోచగా మళ్లీ నగరవీధుల్లో ధర్నాలు, ప్రచారాలు చేయడం మొదలు పెట్టేశాడు. మరోసారి తనకు సీఎం పదవి దక్కేలా చేస్తే గతంలోలాగా కాకుండా... ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసి, తనని తాను నిరూపించుకుంటానంటూ చెప్పుకుంటున్నారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టింది నాకోసం కాదు.. సామాన్య ప్రజలకోసం.. మీకోసం’’ అంటూ నినాదాలు చేసుకుంటూ గల్లీగల్లీల్లో తిరుగుతున్నాడు కేజ్రీవాల్! ఇంతటితో ఊరుకోకుండా... ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ పార్టీ మీద విమర్శలు చేయడం ప్రారంభించాడు.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. ‘‘ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేసేందుకు బీజేపీ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని’’ ఆయన ఒక ఆడియో సందేశాన్ని వెలువరించారు. అలాగే ఢిల్లీలో గద్దెనెక్కేందుకు బీజేపీ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు రూ.20 కోట్ల వరకు ఆశచూపుతోందని ఆరోపించారు. బీజేపీ పార్టీ ఇంకొన్నాళ్లవరకు అధికారంలో కొనసాగితే సామాన్య మానవులకు తీరని అన్యాయం జరుగుతుందని... ఢిల్లీలో బీజేపీ పార్టీ సర్కారు ఏర్పాటు చేయనివ్వకుండా ప్రజలు అడ్డుకోవాలని ఆయన సందేశాలు జారీ చేశాడు.

అయితే ఈయన వ్యవహరిస్తున్న ఈ తీరుపై బీజేపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు ఆయన మీద వ్యంగ్యంగా విమర్శలు చేయడం ప్రారంభించారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు మతిభ్రమించిందని, ఆయన ఒకసారి మెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా మంచిదని’’ బీజేపీ పార్టీ కామెంట్లు చేస్తోంది. ఢిల్లీ అధికారం చేజారిపోయినప్పటి నుంచి కేజ్రీవాల్ మెంటల్ వాడిలాగా ప్రవర్తిస్తున్నాడని... అతని గురించి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పిన బీజేపీ... వెంటనే అతను మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ త్వరలోనే కోలుకుంటాడని కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more