Minister refuses to meet sugar factory representatives

Minister refuses to meet sugar factory representatives, Minister Krupalini asks sugar factory, Sugar factory owes Rs 26 crore to farmers

Minister refuses to meet sugar factory representatives

రైతుల బకాయిలు చెల్లించి అప్పుడు మాట్లాడండి!

Posted: 07/13/2014 02:39 PM IST
Minister refuses to meet sugar factory representatives

చక్కెర కర్మాగారం యాజమాన్యం మంత్రిగారిని కలుసుకోవటానికి వెళ్ళగా వాళ్ళు రైతులకు ముట్టవలసిన డబ్బు అందించకుండా బకాయిలు పెట్టటం పట్ల ఆగ్రహం వహించిన మంత్రి వాళ్ళను కలవటానికి సమయాన్నివ్వలేదు సరిగదా ముందు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వండి ఆ తర్వాత రండి అని పంపించేసారు.

ఈ చేదు అనుభవం విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట సమీపంలో ఉన్న ఎన్ సి ఎస్ సుగర్ ఫాక్టరీకి ఎదురైంది.  ఆ యాజమాన్యం కలుద్దామనుకున్నది రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి డా.కె.మృణాళినిని.  

రైతులకు 26 కోట్ల రూపయలు బకాయిపడి ఉన్న ఆ చక్కెర కర్మాగారం బకాయిలు చెల్లించేట్టుగా చూడమని మంత్రి మృణాళిని కొద్ది రోజుల క్రితం విజయనగరం జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీచేసారు.  కానీ యాజమాన్యం దాన్ని పెడచెవిన పెడుతూ మంత్రితో భేటీకి ప్రయత్నం చెయ్యటంతో ఆమె అందుకు నిరాకరించటమే కాకుండా ముందు ఆ బాకీలను చెల్లించి అప్పుడు ఏదైనా సమస్య మీద మాటలాడాలంటే రండి అని అన్నారు.

మంత్రిగా తాను ప్రభుత్వంలో ఉండి కూడా రైతులకు వాళ్ళకు రావలిసిన సొమ్మును సకాలంలో ఇప్పించలేకపోయినందుకు ఆమె బాధను వ్యక్తంచేసారు.  శ్రమకోర్చి పండించుకున్న పంటను ఇచ్చి కూడా సకాలంలో దాని సొమ్ము ఆ రైతులు పొందలేకపోవటం విచారకరమని మంత్రి అన్నారు.  

వెంటనే బకాయిలు చెల్లించండి, ఆ తర్వాతనే రండి అంటూ ఆ చక్కెర కర్మాగారం యజమాన్యాన్ని ఆదేశిస్తూ,  ఆ పని పూర్తయినతర్వాతనే వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యను పరిష్కరించుకోవటంలో తనను సంప్రదించటానికి రావలసిందిగా మృణాళిని గట్టిగా చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more