Central minister venkaiah naidu sensational comments on congress party

Central minister venkaiah naidu sensational comments on congress party, venkaiah naidu latest news, venkaiah naidu sensational comments on congress party, venkaiah naidu comments on bjp party, venkaiah naidu comments on narendra modi, venkaiah naidu interview, venkaiah naidu news, congress party latest news

Central minister venkaiah naidu sensational comments on congress party

కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు! నాయుడు

Posted: 07/07/2014 11:15 AM IST
Central minister venkaiah naidu sensational comments on congress party

(Image source from: Central minister venkaiah naidu sensational comments on congress party)

ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయినా... ఆ పార్టీ మీద విమర్శలు చేయడం మానలేదు అదికారపార్టీలో వున్న కొంతమంది నాయకులు. ఇప్పుడు తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు... కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లే దేశం ఆర్థికక్షోభలో మునిగిపోయిందని.. ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎన్నో స్కాములు జరిగాయని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం చాలా దారుణమని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారంనాడు జరిగిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంకయ్యనాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘యూపీఏ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా దెబ్బపడింది. యూపీఏ తీసుకున్న నిర్ణయాల వల్లే దేశం వెనుకబడింది. ప్రస్తుతమున్న దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎన్టీయే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే రైల్వే ఛార్జీలను, వంటగ్యాస్, కిరోసిన్ ధనలను పెంచాల్సి వచ్చింది’’ అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలూ చేస్తూ... ‘‘ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించినప్పటికీ... ఆ పార్టీ సిగ్గులేకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్తాం అనడం చాలా దారుణం’’ అని ఆయన మండిపడ్డారు. అలాగే ‘‘కాంగ్రెస్ పార్టీలో వున్న నాయకులు ఇన్నేళ్లు పదువులు అనుభవించి, ఇప్పుడు దక్కకపోవడం వల్ల అసహనంతో వున్నారని... వారి పరిస్థితి ఇప్పుడు ఒడ్డునపడ్డ చేపల్లా మారిపోయిందని’’ నాయుడు అవమానించారు.

‘‘బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద కాంగ్రెస్ పార్టీ నేతల వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వారు అమలు చేసిన తప్పుడు విధానాల వల్ల, వారి అవినీతి పాలనవల్ల ఈ విధంగా ధరలు పెంచాల్సి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి మెరుగుపరచడం కోసం భాజపా ఏమి చేయడానికైనా సిద్ధమేనని అని చెప్పిన ఆయన... ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటుందని, ప్రజలు కూడా తమను అర్థం చేసుకుని, నమ్ముతారనే భావన వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more