(Image source from: Narendra modi prepared to give social media classes to bjp ministers)
అవును... స్కూల్ లో ఏ విధంగా అయితే మాష్టారు పిల్లలకు పాఠాలు బోధిస్తారో... అలాగే మన భారత ప్రధాని నరేంద్రమోడీ తన అధికారంలో వున్న నేతలకు పాఠాలు చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ పార్టీలో వున్న నాయకులందరికీ సోషల్ మీడియా క్లాసెస్ ఇప్పించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఆయన తన అధికారంలో వున్న నాయకుల పనితీరు, వారి ఆలోచనల్లో కొత్త మార్పులు తెచ్చేందుకే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తాను చేసిన మంచి పనుల గురించి, చేయబోయే భవిష్యత్తు కార్యాచరణల గురించి, ప్రభుత్వాలకు సంబంధించిన కార్యకలాపాల గురించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ప్రజలకు తెలియపరిచేవారు. ఇలా చేస్తే... ప్రజలకు తమ ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుందన్న భావనతోనే ఆయన అప్పట్లో అలా చేసేవారని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇప్పుడు తాజాగా ఇదే విషయాల గురించి మోడీ తన అధికారులకు వివరించనున్నట్టు సమాచారం! సోషల్ మీడియాపై వారికి అవగాహన కల్పించి, దాని ప్రాధాన్యత గురించి వివరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించాలి? దాని ద్వారా ప్రచారాలు ఎలా కల్పించాలన్న విషయంపై ఆయన తన అధికారులకు శిక్షణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ అవ్వచ్చని... వారి సమస్యలు, కష్టాలను తేలికగా తెలుసుకోవచ్చునని మోడీ అంటారు. ఇందులో భాగంగానే ఆయన సోషల్ మీడియా శిక్షణ తరగతులను తన అధికారుల కోసం నిర్వహించేందుకు సిద్ధం చేశారు. వీరికి ట్రైనింగ్ ఇవ్వడానికి 39 శాఖలు కూడా ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఇక త్వరలోనే వీరికి శిక్షణ తరగతులు మొదలవుతాయని ఆయా శాఖలు వెల్లడించారు. వారెవ్వా మోడీ! క్యా బాత్ హై!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more