(Image source from: dead man come back to life in cremeation center)
చెన్నైలో భవనం కూలిన జరిగి మూడు రోజులయ్యింది. ఈ ప్రమాదంలో మన ఆంధ్రరాష్ట్రానికి చెందిన కూలీలు వున్న విషయం తెలిసిందే! ఆ విషాద సంఘటనలో దాదాపు 61మంది చనిపోయినట్లు చెన్నై అధికారులు తెలుపుతున్నారు. ఇంకా ఆ భవనంలో ఎంతమంది కూరుకుపోయారోనన్న విషయం ఇప్పుడే చెప్పలేమని... ఒకవేళ అందులో వుంటే బతికే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. అందులో నుంచి వెలికి తీసిన మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.
ఈ తవ్వకాల నేపథ్యంలో బయటికి తీసిన ఒడిశాకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి కూలిపోయినట్లు గుర్తించిన పోలీసు అధికారులు అతని మృతదేహాన్ని స్వస్థలానికి పంపి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీవనోపాధికోసం వెళ్లి... శవమై తేలి వచ్చాడని విషాదంలో మునిగిపోయిన అతని కుటుంబసభ్యులు... అంత్యక్రియల కోసం అన్ని సిద్ధం చేసి వుంచారు. అతడికి తీసుకుని వెళ్లడానికి సిద్ధమవ్వగా అంతలోనే వారికి చెన్నై పోలీసు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ ప్రకాష్ బ్రతికే వున్నాడు’’ అని వారు చెప్పగానే... వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
శిథిలాల క్రిందపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కమంటున్న ప్రకాష్ ను పోలీసు అధికారులు గుర్తించి, అతడ్ని రక్షించారు. వెంటనే అతను తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, నేను క్షేమంగానే వున్నాను అంటూ సమాచారం అందించాడు. అయితే ప్రకాష్ స్థానంలో వేరొక శవాన్ని ఒడిశాకు పంపించిన పోలీసు అధికారులు... తిరిగి దానిని చెన్నైకు తరలించనున్నారు. ఆ శవం ఎవరిదో అనే గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more