Tdp mlas gandhi and vivek goud arrested for protesting against kcr

tdp mlas gandhi and vivek goud arrested for protesting against kcr, tdp mla vivek goud, serilingampally tdp mla gandhi, tdp mlas gandhi and vivek goud arrested, tdp mlas gandhi and vivek goud protesting

tdp mlas gandhi and vivek goud arrested for protesting against kcr

కిరణ్, జగన్ బంధువుల ఇళ్లను కూల్చలేవా కేసీఆర్? -తెలంగాణ లీడర్స్

Posted: 06/25/2014 06:24 PM IST
Tdp mlas gandhi and vivek goud arrested for protesting against kcr

(Image source from: tdp mlas gandhi and vivek goud arrested for protesting against kcr)

కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో... ముఖ్యంగా జంటనగరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న విషయం తెలిసిందే! ఈ వ్యవహారం మీద వ్యతిరేకంగా గళం ఎత్తినవారు... నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. దానికి సమాధానంగా కేసీఆర్ కూడా ఘాటుగానే జవాబిచ్చారు. ఏ అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని, నేరుగానే వాటిని కూల్చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాధాపూర్ గురుకల్ ట్రస్ట్ లో, అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ విధంగా కూల్చివేయడం అన్యాయమని, అసలు వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తూ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

వీరిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయిన వివేక గౌడ్... రాజకీయ ఇళ్లను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం, సామాన్యుల ఇళ్లను ఎలా కూల్చుతున్నారని వారి మీద విమర్శల దాడి చేశారు. అలాగే.. అక్రమంగా ఇళ్లను నిర్మించుకున్న మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడు అయిన వివేకానందరెడ్డి వంటి తదితర నాయకుల ఇళ్లను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఇదంతా కావాలనే కొందరు చేయిస్తున్నారని, ఇలా చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే... కేసీఆర్ కూడా బడాబాబులకు అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. అలాగే కేసీఆర్ కూతురు, ఎంపీ అయిన కవిత మీద కూడా విరుచుకుపడ్డారు. ‘‘గతంలో ఎంపీ కవిత నిజామాబాద్ బాధితులకు అండగా వుంటానని మాటిచ్చారు. కానీ ఇప్పుడు అన్యాయంగా జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపడానికి ఆమె ముందుకు రావడం లేదు. ఈ కూల్చివేతలను చూస్తూ.. కూర్చిండిపోయారు’’ అని తీవ్రంగా ఆరోపించారు.

మరోవైపు శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్యెల్యే అయిన గాంధీ కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ... ‘‘కేసీఆర్ ప్రభుత్వం బడాబాబులతో చేతులు కలిపి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అసలు అక్రమ కట్టడాలను కూల్చేయాలని అనుకుంటే.. ముందుగా బడాబాబుల ఇళ్లను ఎందుకు కూల్చడం లేదు. వారు నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లను ఎందుకు మూయించడం లేదు. నిజమైన అక్రమదారులను పక్కకు పెట్టి, కొనుగోలుదార్ల ఇళ్లను అనవసరంగా కూల్చుతున్నారు’’ అని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో వున్న కేసీఆర్ రెండు నాలుకల మనిషిగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కట్టడాల కూల్చివేతలకు తమ నిరసనను వ్యక్తం చేయగా... పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more