Chandrababu naidu and ys jagan praises kodela sivaprasad for elected as ap speaker

chandrababu naidu and ys jagan praises kodela sivaprasad for elected as ap speaker, chandrababu naidu comments on kodela sivaprasad rao, ys jagan mohan reddy comments on kodela siva prasad rao, chandrababu and jagan praises kodela siva prasad, kodela siva prasad elected as ap assembly speaker, chandrababu naidu in ap assembly

chandrababu naidu and ys jagan praises kodela sivaprasad for elected as ap speaker

కోడెలది అన్యాయం చేసే మనస్తత్వం కాదు - బాబు

Posted: 06/20/2014 10:19 AM IST
Chandrababu naidu and ys jagan praises kodela sivaprasad for elected as ap speaker

(Image source from: chandrababu naidu and ys jagan praises kodela sivaprasad for elected as ap speaker)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావుగారు ఎన్నిక కావడంపై పలు రాజకీయ నేతలు ఆయన మీదున్న అభిమానాన్ని, ఆయన వ్యక్తిత్వం గురించి వ్యక్తపరిచారు. ఏపీ శాసనసభకు తొలి సభాపతిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ నుంచి అభినందనలను తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కోడెల మీద ప్రశంసల జల్లులు కురిపించారు.

శాసనసభలో చంద్రబాబు నాయుడు, కోడెల గురించి మాట్లాడుతూ... ‘‘1983వ సంవత్సరం నుంచే కోడెల నాకు బాగా తెలుసు. ఏ పదవి ఇచ్చినా దానిని వన్నె తెచ్చి, సమర్థవంతంగా తమ సేవలను అందించేవారు. క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఆయన అందించిన సేవలు మరువలేనిది. సిద్ధాంతాలను విలువనిస్తూ, పార్టీ గౌరవాన్ని నిలుబెట్టవారు. అధికారం లేకపోయినా ప్రజలకు నిత్యం సేవలు అందించేవారు. రైతుల సమస్యలను పరీక్షించి చిత్తశుద్ధితో పనిచేసిన నాయకుడు.  ఆయన స్పీకర్ గా ఎన్నిక కావడం ఎంతో గర్వకారణం’’ అని వ్యక్తిగతంగా తన మనసులోని మాటలను బహిర్గతం చేశారు.

అదేవిధంగా ప్రతిపక్షనేత అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ కోడెల గురించి మాట్లాడుతూ... ‘‘కోడెల శివప్రసాదరావుగారు ఎంతో మంచి మనిషి. ఆయన శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు చేపడుతున్నారనే విషయం తెలిసి వెంటనే మా పార్టీ తరఫు నుంచి మద్దతును ప్రకటించాం. ప్రజాస్వామ్యం అనే బండికి కోడెలగారు ఇరుసులాంటివారు’’ అని చెప్పారు. అలాగే బండికున్న రెండు చక్రాలలో ఒకటి అధికారం అయితే.. మరొకటి కోడెల శివప్రసాదరావు అంటూ ఆయన మీద ప్రశంసలు కురిపించారు. కేఈ కృష్ణమూర్తి కూడా కోడెల గురించి మాట్లాడుతూ... ‘‘సిన్సియారిటికి, సీనియారికి మారుపేరయిన కోడెలగారు... రాబోయే స్పీకర్లకు ఆదర్వంగా నిలుస్తారు’’ అంటూ ఆకాంక్షించారు.

గతంలో హోంశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య శాఖలలో సేవలు అందించి, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన గెలుపొందిన కోడెల శివప్రసాదరావు... ఇలా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అధికార పార్టీనేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more