ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలను) రద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది పిపిఎలను రద్దు చేయాలని ఎపి జెన్కో రాసిన లేఖను విద్యుత్తు నియంత్రణ సంస్థ (ఈఆర్సి) తిరస్కరించింది. పిపిఎలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినందున రెండు రాష్ట్రాల డిస్కంలు కలిసి కోరితేనే రద్దు సాధ్యమని ఈఆర్సి స్పష్టం చేసింది. గతంలో తమకు పీపీఏ ప్రతిపాదన దాఖలు చేసిన వారు వేరు, ఇప్పుడు ఉపసంహరణ కోరుతున్న వారు వేరు అని అభిప్రాయపడింది. 'కొన్ని పీపీఏలు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలంటూ మీరు లేఖ రాశారు. కానీ... కమిషన్ ముందు పీపీఏలు దాఖలు చేసిన వారి నుంచి ఈ అభ్యర్థన రాలేదు. అందువల్ల మీ లేఖను పరిగణనలోకి తీసుకోలేం'' అని స్పష్టం చేసింది.
ఏకపక్షం కుదరదు: తెలంగాణ
ఇరు రాష్ట్రాల జెన్కోల విద్యుదుత్పత్తి ప్లాంట్లకు చెందిన ముసాయిదా పీపీఏలు ఈఆర్సీలో పెండింగ్లో ఉన్నాయనే కారణంతో... వాటిని ఉససంహరించాలని ఏపీ జెన్కో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమర్థనీయం కాదు. పీపీఏలపై సంతకం చేసిన ఇరుపక్షాల ఉమ్మడి నిర్ణయంతోనే వాటి ఉపసంహరణగానీ, రద్దుగానీ చేయవచ్చు. తెలంగాణ డిస్కంల ఆమోదం లేకుండా ఏపీ జెన్కో మాత్రమే తన పీపీఏ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవడం చెల్లుబాటు కాదు. ఇలా ఏకపక్షంగా పీపీఏలను రద్దు చేస్తే.. తెలంగాణ మరింతగా విద్యుత్ సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఏపీ జెన్కో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ జెన్కో పీపీఏలు ఇప్పటికే అమలులో ఉన్నట్లే. జీవో 20 ప్రకారం విద్యుత్ సరఫరా జరగాల్సిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ మేము పీపీఏల ఉపసంహరణకు అంగీకరించం. పెండింగ్లో ఉన్న పీపీఏలను ఈఆర్సీ వెంటనే ఆమోదించాలి.
ఏకపక్షంకాదు... చట్టబద్ధం: ఏపీ
ఏపీ జెన్కో చట్టబద్ధంగానే వ్యవహరించింది. ముసాయిదా పీపీఏలు 2009 నుంచి ఈఆర్సీ ముందు పెండింగ్లో ఉన్నాయి. దానికి కారణం మేం కాదు. ముసాయిదా పీపీఏలను ఆమోదించలేదు కాబట్టే, వాటిని ఉపసంహరించుకున్నాం. ఐదేళ్లుగా విద్యుత్ టారిఫ్లను నిర్ణయించినంత మాత్రాన, పీపీఏలను పాక్షికంగా ఆమోదించినట్టు కాదు. పీపీఏలను ప్రత్యేకంగా ఈఆర్సీ ఆమోదిస్తేనే అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. కేవలం టారిఫ్ల ఆధారంగా పీపీఏలను ఆమోదించినట్టుగా భావిస్తే.. మళ్లీ ప్రత్యేకంగా పీపీఏలను సమర్పించాల్సిన అవసరమేమిటి? వాటిపై బహిరంగ విచారణ జరపడమెందుకు? రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా సమర్పిస్తేనే 2014-15కు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు స్వీకరిస్తామని ఈఆర్సీ స్పష్టం చెప్పింది. మరి... పీపీఏలు అమల్లో ఉన్నట్టయితే విద్యుత్ చార్జీలను ఎందుకు ఆమోదించలేదు? 2014-15 ప్రతిపాదనలను ఈఆర్సీ వెనక్కి పంపినందున, పెండింగ్లో ఉన్న పీపీఏలకు ఆమోద ముద్ర లేనట్టుగా భావించాలి. ఈ విషయంలో ఏపీ జెన్కో తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లదు. తెలంగాణ డిస్కంలతో పీపీఏలను రద్దు చేసినట్టుగానే భావించాలి.
పిపిఎలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ జెన్కో రాసిన లేఖ విషయంలో వివాదం తలెత్తడంతో కేంద్రం కూడా జోక్యం చేసుకుంది. పిపిఎలను రద్దు చేస్తే తెలంగాణకు 460 మెగావాట్ల విద్యుత్తుకు కోత పడుతుంది. దీనివల్ల తెలంగాణలో తీవ్రమైన సమస్య తలెత్తుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపేసింది. గతవారం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా, గుంటూరు ప్రకాశం జిల్లాలకు పది టిఎంసిల నీటిని విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. దీనికి ప్రతీకారంగానే పిపిఎలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
Cartoon Soruce & Copyrights are of www.oneindia.in
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more