Telangana cm kcr fire on andhrajyothy paper in telangana assembly

CM KCR fire on andhrajyothy paper, KCR fire on andhrajyothy paper, Telangana CM KCR fire on andhrajyothy paper, Telangana Assembly, tv9 channel, KCR Speech in Assembly, CM KCR speech in Telangana Assembly, cm kcr fire on andhra media.

Telangana CM KCR fire on andhrajyothy paper in Telangana Assembly

ఆంద్రజోత్యి పై కేసిఆర్ ఫైర్-సారీ చెప్పిన టీవీ9

Posted: 06/13/2014 03:56 PM IST
Telangana cm kcr fire on andhrajyothy paper in telangana assembly

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ.. ఆంద్రజ్యోతి పత్రిక, మీడియా ఛాన్స్ టీవీ9పై మండిపడ్డారు. ఆయన ఒక్కసారి మీడియా ను ఎందుకు టార్గెట్ చేసారో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆయన సభలోకి ఆంద్రజ్యోతి పేపర్ రాసిన వార్తలు చెప్పటంతో శాసనసభలో ఉన్న వారికి అర్థమైంది. తెలంగాణముఖ్యమంత్రి పై వ్యతిరేకంగా వార్తలు రాసి ఉంటుందని అందరు అర్థం చేసుకున్నారు.

తెలంగాణలో ఇంకా ఆంధ్రామీడియా అహంకారాన్ని సహించేది లేదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ టీవీ9 ఛానల్ తెలంగాణ శాసనసభను, ఎమ్మెల్యేలను ఘోరంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ్యులది పాచికల్లు తాగిన మొహాలని టీవీ9 రాసిందని విమర్శించారు.

టూరింగ్ టాకీస్ లో సినిమాలు చూసేవారిని తీసుకొచ్చి మల్టీఫెక్స్ లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో... తెలంగాణ శాసనసభ అలాం ఉందని వ్యాఖ్యలు చేశారు. పాచికల్లు తాగిన ముఖాలుగా శాసన సభ్యులను టీవీ-9 అభివర్ణించింది. అంతటి అహంకారంతో వ్యవహరిస్తారా'' అని ఆయన ప్రశ్నించారు. పిట్ట బెదిరింపులకు, తప్పుడు ప్రచారాలకు ఎవ్వరూ భయపడరని కేసీఆర్ అన్నారు. గౌరవ శాసనసభ్యులకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. తమిళనాడులో జయలలితలాగా అవసరం అయితే కేబుల్ చట్టాలను అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు.

ఆంధ్రజ్యోతి పత్రిక పనిగట్టుకొని విషం కక్కుతోందన్నారు. ఏదైర్యంతోని ఆంధ్రజ్యోతి పత్రిక అడ్డగోలు రాతలు రాస్తోందని హెచ్చరించారు. ఆంధ్రామీడియా లేని ఇష్యూలను ఉన్నట్టు చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రామీడియా అహంకారాన్ని సహించేది లేదని.. తమిళనాడు తరహాలో కేబుల్ చట్టాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుందని వెల్లడించారు.

టీవీ9 క్షమాపణ

తెలంగాణ శాసనసభ్యులపై బుల్లెట్ న్యూస్ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కావడంపై చింతిస్తున్నామని, ఈ వ్యాఖ్యల ప్రసారంపై శాసనసభకు టీవీ9 క్షమాపణ చెబుతోందని టీవీ9 ఎడిటర్ ప్రకటించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

జీవన్‌రెడ్డి ఆవేశం.

తెలంగాణ శాసనసభ, ఎమ్మెల్యేలను అవమానించిన మీడియాపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎమ్మెల్యేలను కించపరిచిన మీడియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more