ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రుల బృందంతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య జరిగే ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రుల బృందంతో కలిసి ఆయన ప్రమాణం చేస్తారని ఆహ్వాన పత్రాల్లో ముద్రించారు.
అయితే ఈ కార్యక్రమానికి ఆయన పర్సనల్గా పవర్స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ని ఆహ్వానించారని సమాచారం. చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజ్నాథ్సింగ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాలేకపోవచ్చునని పీఎంవో వర్గాలు అంటున్నాయి.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను ఆహ్వానించాలా.. వద్దా అన్న సందిగ్దంలో బాబు ఉన్నట్లు తెలుస్తుంది. మీడియా వర్గాల కథనం ప్రకారం ఇప్పటివరకు వీరిద్దరికీ ఎలాంటి ఆహ్వానం అందకపోయినా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో బాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
'నా కట్టె ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటా' అని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించిన విషయం గమనార్హం. పైగా ఈ పార్టీ తన తాతయ్య స్థాపించిన పార్టీ గనుక.. అది అధికారంలోకి రాబోతున్న తరుణంలో.. చంద్రబాబు నుంచి కాల్ వచ్చినా, రాకున్నా ఈ ఫంక్షన్కి జూనియర్ హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు కావచ్చని తెలుస్తుంది.
చంద్రబాబు, కార్పొరేట్ ప్రపంచాన్నీ ఆహ్వానించారు. అలా ఆహ్వానాలు అందుకున్న వారిలో అంబానీ బ్రదర్స్, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ, టాటా గ్రూప్ సిఎండి సైరస్ మిస్త్రీ, మహింద్రా అండ్ మహింద్రా సిఎండి ఆనంద్ మహింద్రా ఉన్నారు.
రాష్ట్రంలోని పలువురు వాణిజ్య, పారిశ్రామిక వేత్తలను కూడా తెదేపా, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. కార్పొరేట్ పెద్దలను పిలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరేందుకేనని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావడంతో కార్పొరేట్ దిగ్గజాలు, విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం వల్ల మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మిస్తే, ఏ మేరకు లబ్ధి పొందవచ్చునో స్వయంగా పరిశీలించే అవకాశం చిక్కుతుందని తెదేపా వర్గాలు తెలిపాయి.
అతిదుల కోసం ఇప్పటికే విజయవాడ, గుంటూరు స్టార్ హోటల్లలో రూంలు భారీగా బుక్ చేసారట. ప్రమాణ స్వీకర వేడుకను గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ చాలా ప్రతిష్టత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారట.
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆయన తొలి విడతకు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని, ఒక మహిళను ఆయన తన తొలి విడత టీంలో తీసుకోవచ్చని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కెఇ కృష్ణమూర్తి (బీసీ, రాయలసీమ), నారాయణ (కాపు, నెల్లూరు), దేవినేని ఉమా మహేశ్వరరావు లేదా పరిటాల సునీత (కమ్మ), గొల్లపల్లి సూర్యారావు లేదా పీతల సుజాత (ఎస్సీ, మాల), రావెళ్ళ కిషోర్బాబు (ఎస్సీ మాదిగ), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (రెడ్డి, రాయలసీమ), కళా వెంకట్రావు లేదా గంటా శ్రీనివాసరావు (ఉత్తరాంధ్ర), అయ్యన్నపాత్రుడు లేదా పిల్లి అనంతలక్ష్మి (బీసీ, ఉత్తరాంధ్ర / తూర్పు గోదావరి) తొలి విడత బృందంలో ఉండే అవకాశం ఉంద వారికి ని అంటున్నారు.
Chandra Babu Naidu personally invited Pawan Kalyan to attend Cheif Minister swearing in cermony in Guntur on June 8th. Rajnath Singh will also attend the swearing cermony frunction from BJP. Babu has not yet invited Jr.NTR or HArikrishna in person.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more