జూన్ 2వ తేదీన తెలంగాణలో, జూన్ 8న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని గవర్నర్ నరసింహన్ శనివారం చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా జూన్ 2న ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. తాను ఉదయం ఆరున్నర గంటలకు గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని, తెరాస అధ్యక్షులు కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా గం.8.25కు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయుటానికి సిద్ధమవుతున్న కె.చంద్రశేఖరరావు తన మంత్రివర్గ కూర్పును దాదాపుగా పూర్తి చేశారు. కేబినెట్లోకి ఇద్దరు ఉపముఖ్యమంత్రులను తీసుకోవటానికి ఆయన నిర్ణయించినట్టు సమాచారం.
మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న తన గత హామీ మేరకు ఎమ్మెల్సీ మహ్మద్ అలీకి అవకాశం కల్పించనున్నారు. దళితులకూ ప్రాధాన్యమిస్తానన్న హామీ ప్రకారం ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ను మరో డిప్యూటీ సీఎంగా తీసుకోనున్నట్టు సమాచారం.
పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయిని నర్సింహారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికఅవకపోయిన ఆయన విధేయుత, సీనియారిటీ దృష్ట్యా మంత్రివర్గంలోకి తీసుకుని ఏదైనా ముఖ్య శాఖ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒకవేళ డిప్యూటీ సీఎంకు హోం శాఖ ఇవ్వొద్దని చివర్లో నిర్ణయిస్తే ఆ పోస్టు నాయిని దక్కవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు.
కేటీఆర్ కు మంత్రిపదవే!
టీఆర్ఎస్ పగ్గాలను కేసీఆర్ తన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరామారావు (కేటీఆర్)కు అప్పగిస్తారనే ప్రచారం జరిగినా, మొత్తానికి ఆయనను కూడా మంత్రివర్గంలోకే తీసుకోవాలని ఆయన అంతిమంగా నిర్ణయించారు. ఆయన కు మౌలిక వసతులు, పరిశ్రమలు, ఐటీ శాఖలు అప్పగిస్తారని విశ్వసనీయు సమాచారం.
ప్రత్యేక తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి కీలకం కాబోతున్నందున కేటీఆర్ కు ఆ బాధ్యతలు ఇవ్వనున్నారు. అలాగే తన మేనల్లుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు అంతా ఊహిస్తున్నట్టుగానే సాగునీరు, ఇంధన శాఖలు అప్పగించనున్నారు.
తను ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన పలు సంక్షేమ పథకాల్ని ఆశించినంత వేగంగా, సమర్థంగా అమలు చేయుటానికి వీలుగా కేసీఆర్ అన్నిరకాల సంక్షేమ మంత్రిత్వ శాఖల్ని తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది
తెలంగాణ ప్రారంభ దినోత్సవానికి కొంత గడువు:
జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ప్రభుత్వయంత్రాంగం పూర్తిస్థాయిలో పని ప్రారంభించిననాడే 'తెలంగాణ ప్రారంభ దినోత్సవం' నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అదే రోజు జరిగే కేబినెట్లో సంతకాలు వంటి ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more