తెలంగాణ ప్రాంతంలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగింది. ఆంధ్ర నాయకుల ఒత్తిడితోనే పోలవరం ముంపు పేరుతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్ని సీమాంధ్రలో చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ అయ్యిందన్నది కేసీఆర్ తాజా ఆరోపణ.
హైదరాబాద్ నగరంతోపాటు పది జిల్లాల్లోనూ బంద్ ప్రశాంతంగా సాగింది. ఆర్టీసి బస్సులు తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఎంఎంటిఎస్ రైళ్లల్లో కిక్కిరిసి ప్రయాణించారు.
కామెడీ కాకపోతే, ఆంధ్ర ప్రాంత నేతలకు ఢిల్లీ రాజకీయాల్ని శాసించేంత సీన్ ఎక్కడుంది.? నిజంగానే ఆంధ్ర ప్రాంత నేతలకి అంత సీన్ వుండి వుంటే, అసలంటూ ఆంధ్రప్రదేశ్ ఎందుకు విభజనకు గురవుతుంది.? ఆఖరికి సీమాంధ్రకు కొత్త రాజధాని ఏమిటో కూడా చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విభజించేసింది. ఆంధ్ర ప్రాంత నేతల ఒత్తిడి ఎక్కడా పనిచేసిన దాఖలాలే లేవు.
1956కి ముందున్న తెలంగాణ కావాలి.. అంటూ తెలంగాణ ఉద్యమం సాగింది. దానికి బోనస్గా ఒకప్పటి సీమాంధ్ర ప్రాంతంలోని భద్రాచలం డివిజన్నీ, అశ్వాపురం, మునగాల (ఇవీ ఒకప్పుడు సీమాంధ్రలోనివే) తెలంగాణకు కట్టబెట్టింది మన్మోహన్ సర్కార్ రాష్ట్ర విభజన నేపథ్యంలో. బోనస్లన్నీ తెలంగాణ ప్రాంతానికే దక్కాయి.. మరి, కేసీఆర్ ఇంకా ఆంధ్ర ప్రాంతమ్మీద పడి ఎందుకు ఏడుస్తున్నట్టు.?
పోలవరం ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ అధికార పార్టీ బంద్కు పిలుపునివ్వడం అసమర్థతకు చిహ్నమే అని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్ తాయారైన సమయంలో కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
'పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు గానీ.. పోలవరం డిజైన్పైనే మా అభ్యంతరం.. ముంపు పేరుతో తెలంగాణ భూ భాగాన్ని ఆంధ్రలో కలపడానికి ఒప్పుకోం..' ఇదీ కేసీఆర్ వాదన. అయినా డిజైన్ ఇప్పుడు రూపొందించింది కాదు. పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్ర విభజన అంశంతోనే తెరపైకి వచ్చింది కాదు. సమైక్య రాష్ట్రంలో.. ఆ మాటకొస్తే.. దశాబ్దాల క్రితమే పూర్తవ్వాల్సింది పోలవరం ప్రాజెక్టు. అప్పటినుంచీ ఇప్పటిదాకా.. పోలవరం ప్రాజెక్టుకి పట్టిన గ్రహణం వీడలేదు సరికదా.. విభజనతో సరికొత్త గ్రహణం పట్టేసింది. విభజన విషయంలోగానీ, పోలవరం విషయంలోగానీ, సీమాంధ్ర నేతల ఒత్తిడి ఎక్కడా ఫలించలేదన్నది నిర్వివాదాంశం. సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఒక్క డిమాండ్నీ పరిగణనలోకి తీసుకోని కేంద్రం, ఉమ్మడి రాజధాని అంశంలో తప్ప, ఏ విషయంలోనూ సీమాంధ్ర ప్రాంతానికి మేలు చేసేలా వ్యవహరించలేదు.
పోలవరం ముంపు గ్రామాల వ్యవహారం నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తెరపైకొచ్చింది కాదు. రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంట్లో ఆమోదించినప్పుడే ఈ అంశం తెరపైకొచ్చింది. ఆ తర్వాతనే కదా, తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కేసీఆర్ సాష్టాంగపడి కృతజ్ఞతలు తెలిపింది. 'పోలవరం ముంపు గ్రామాల్ని ఆంధ్రలో కలపడానికి వీల్లేదు..' అని నిలదీస్తూ, సోనియాకి కేసీఆర్ ఎందుకు మొహం చాటెయ్యలేదు. పైగా కుటుంబ సమేతంగా సోనియాగాంధీ వద్దకు పరిగెత్తారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు కాబోతోన్న ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాల అసెంబ్లీల సమన్వయంతోనే రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్నది కేసీఆర్ వాదన.
అలాగైతే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒప్పుకోకుండానే ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజించినట్టు.? అప్పుడో న్యాయం.. ఇప్పుడో న్యాయం. కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతోంది కాబట్టి, ఆయన ఏదన్నా మాట్లాడతారు. సీమాంధ్ర నేతలు మాత్రం, ఏమీ మాట్లాడలేని, ఒకవేళ మాట్లాడినా వారి మాట నెగ్గని పరిస్థితి వుందిప్పుడు. అందుకే సీమాంధ్ర నేతలంతా చేష్టలుడిగి చూస్తున్నారంతే. పోలవరం ముంపు గ్రామాల కోసం మొత్తం తెలంగాణ ఒక్కటవుతోంది. వాస్తవానికి భద్రాచలం డివిజన్ ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగం. అశ్వారావుపేట పశ్చిమగోదావరి జిల్లాకు చెందినది. మునగాల కృష్ణా జిల్లాలో వుండేది. ఇది చరిత్ర. కానీ, 'మన ఆంధ్రప్రదేశ్' కాబట్టి.. ఏ జిల్లాలో వున్నా ఒక్కటేనన్న ఆంధ్రుల ఆలోచనతోనే ఆయా ప్రాంతాలు తెలంగాణ జిల్లాల్లో కలపబడ్డాయి. అప్పుడు 'మన' అనుకోబట్టే.. ఇప్పుడు మనక్కాకుండా పోయిందని ఆయా జిల్లాల ప్రజానీకం వాపోతున్నారు.
అభివృద్ధి చెందిన రాజధానిని కోల్పోయాక.. మండలాలు, గ్రామాలు వుంటే ఎంత.? ఊడితే ఎంత.? అన్న నైరాశ్యం అయితే సీమాంధ్రుల్లో స్పష్టంగా కన్పిస్తోంది.
ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ వద్దకు వెళ్లి ఫోటోలు దిగినప్పుడు టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావుకు పోలవరం ముంపు మండలాల గురించి గుర్తుకు రాలేదా అని బిజెపి తెలంగాణ అద్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టిఆర్ఎస్ కేంద్రంతో ఘర్షణ వైఖరి వల్ల తెలంఆణ కు నష్టం జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
అయితే ముఖ్యమంత్రిగా బాధ్యత చేప్పట్టబోతున్న కేసీఆర్ , ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల గురించి ఈ విధంగా మాట్లాడటానికి అసలు కారణం మాత్రం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికలలో పోటీ చేసి అధికారం దక్కించుకోగలిగారు కానీ ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదు. పైగా ఎన్నికలలో గెలిచేందుకు ఆయన ప్రతీ కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంద విద్య వంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. అవికాక విద్యుత్, సాగునీరు, ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అనేక సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే అవ్వన్నీ పరిష్కరించడం అంత తేలికయిన విషయం కాదు. బహుశః అందుకే ఆయన తనకు బాగా తెలిసిన విద్యను మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణా ప్రజలు దోపిడీకి గురవుతున్నారంటూ మళ్ళీ వారిలో సెంటిమెంటు రాజేసి, వారి దృష్టిని మళ్ళించే ప్రయత్నంలోనే ఆయన ఈవిధంగా కయ్యాలకు దిగుతున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విశేష ప్రజాధారణతో డిల్లీ పీఠం ఎక్కిదిగిపోయిన అరవింద్ కేజ్రీవాల్ అందుకు సజీవ ఉదాహరణ అంటున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం నడపడం చేతకాక, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు, తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే నిత్యం గొడవలు పెట్టుకొంటూ, ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా డిల్లీ రోడ్ల మీద నిరసన దీక్షలు చేసేరు. చివరికి ఒకమంచి రోజు, ఒక కుంటి సాకు చూసుకొని అధికారంలో నుండి దిగిపోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ కూడా అచ్చు అరవింద్ కేజ్రీవాల్ లాగే ఇప్పుడు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన కేజ్రీవాల్ లాగ మధ్యలో అధికారం వదులుకోరని చెపుతున్నారు.
వారి విశ్లేషణే నిజమయితే, ఇకపై రానున్న ఐదేళ్ళు కూడా కేసీఆర్ ఏదో ఒక కుంటి సాకుతో ఆంద్ర, కేంద్ర ప్రభుత్వాలతో యుద్ధం చేస్తూనే ఉంటారనుకోవలసి ఉంటుంది. తెలంగాణా ప్రజలకు అనేక ఆశలు కల్పించి వాటిని నెరవేర్చకుండా ఇలా ఏదో ఒక వంకతో వారి దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నిస్తూ కాలక్షేపం చేసేయవచ్చని కేసీఆర్ భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.
తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్, తెలంగాణా బంద్ కు పిలుపునీయడం ద్వారా, రానున్న ఐదేళ్ళలో తన పాలన ఏవిధంగా ఉండబోతోందో తెలంగాణా ప్రజలకు అప్పుడే రుచి చూపిస్తున్నట్లున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈవిధంగా బందులు, సమ్మెలకు పిలుపునిస్తుంటే, ఇప్పటికే ఉద్యమాలతో ఘోరంగా దెబ్బ తిన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బ తినడం ఖాయం. ఇటువంటి వాతావరణంలో కొత్తగా పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు ముందుకు రావడానికి వెనుకాడవచ్చును. ప్రస్తుతం ఉన్నవి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా ఆశ్చర్యం లేదు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదును కాపాడుకోవాలంటే, కేసీఆర్ ఇటువంటి యుద్దవాతావరణం సృష్టించే ఆలోచనలు విరమించుకోవడం చాలా అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more