Pawan slams ys and jagan for land mafia

YSRCP, Land mafia, Jagan, Pawan Kalyana, TDP, seemandhra election

YS land mafia lead to Telangana split - Pawan

మిగిలేది ఆరడుగులే! - PAWAN

Posted: 05/03/2014 08:46 AM IST
Pawan slams ys and jagan for land mafia

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లోని నరసాపురం, తణుకు, కాకినాడ, రాజమండ్రిలలో జరిగిన బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ చుట్టూ జగన్, ఆయన అనుచరులు చేసిన భూ కబ్జాల వల్లే తెలంగాణ ప్రజలు తిరగబడ్డారని చెప్పారు.

వైఎస్ భూ దాహానికి విలువైన వేలాది ఎకరాల పంట భూములు స్వాహా అయ్యాయని విమర్శించే సందర్భంలో.. ఆయన మృతిని పరోక్షంగా గుర్తుకు తెస్తూ.. ఓ కథని పవన్ ఆసక్తికరంగా చెప్పారు. "సోవియట్ సాహిత్యంలో నేను ఒక కథ చదివాను. జార్ చక్రవర్తి వద్దకు ఓ వ్యక్తి వెళ్లి పంటలు పండించుకునేందుకు భూమి కావాలని అడుగుతాడు. ఎంత భూమిని చూపించినా 'సరిపోదు' అంటాడు. దీంతో ఆ చక్రవర్తి 'సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా నువ్వు ఎంత దూరమైతే పరుగెడతావో, అంత భూమిని నీకు ఇస్తాన'ని చెబుతాడు. ఆ వ్యక్తి అత్యాశతో వేగంగా సూర్యాస్తమయం వరకూ పరుగులు తీసి అలసిపోతాడు. మరో పదడుగులు వెళితే ఆ భూమి కూడా వస్తుందనే అత్యాశతో ముందుకు వెళ్లి కుప్పకూలి చనిపోతాడు. చివరకు ఆ మనిషికి ఆరడుగుల భూమే గతయింది. అదే మాదిరి భూకబ్జాలకు పాల్పడినా.. దోపిడీలకు పాల్పడినా.. ఎవరికైనా సరే ఆ ఆరడుగులే మిగుతుంది'' అని వివరించారు.

దివంగత నేత వైఎస్ దుర్మార్గాలు, వైసీపీ నేత జగన్ దోపిడీ వల్లనే రాష్ట్రంలో వైషమ్యాలు పెరిగాయని ఆయన ధ్వజమెత్తారు. సీఎం పదవి కోసం జగన్ తన తల్లిని కష్టపెట్టి ఎండలో తిప్పుతున్నారని, వైఎస్ బతికుండగా సుఖంగా ఉన్న ఆమె ఇపుడు రోడ్లపై తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర పౌరుషాన్ని కాపాడలేనివాడు, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసి, జైలుకు వెళ్లిన వాడు సీఎం కాలేడని తేల్చిచెప్పారు.

వైసీపీ హటావో సీమాంధ్ర బచావో అని పవన్ నినదించినప్పుడు అభిమానుల నినాదంతో స్టేడియం మారుమోగిపోయింది. "నాక్కొంచెం తిక్క ఉంది దానికో లెక్క ఉంది అందుకే నేను ఇక్కడ ఉన్నా'' అని పవన్ అనగానే అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా గోదావరి జిల్లాల్లో జరిగిన పవన్ సభలకు జనం పోటెత్తారు. రాజమండ్రిలోని స్టేడియం నిండిపోయి జనాలు రోడ్లపై ఉండిపోవడంతో ట్రాఫిక్ భారీగా జాం అయింది. నరసాపురం, తణుకు కాకినాడ ల్లో జరిగిన సభల్లోకూడా భారీగా జనం తరలివచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more