తెలివైన తెలుగు ప్రజలారా ? ఒక్క నిమిషం ఆలోచించండి? మన తెలుగు రాష్ట్రంలో.. మంచి నాయకుడు, నిజాయితీ గల నేత, నిస్వర్థం కలిగిన మహా నాయకుడు, సంస్కారం తెలిసిన తెలుగు నాయకుడు, బూతు మాట్లాడని బుద్దుడు లేడా? పది కోట్ల జనభాలో.. ఒక మంచి నాయకుడు లేడా? అంటే అది నిజంగా మనకే సిగ్గు చేటు.
యాబైఆరు అక్షరాలకు పురుడుపోసుకున్న తెలుగుగడ్డ, ఎంతో మంది మహానీయులను, మహా నేతలను, విప్లవ వీరులను, కల్మషం లేని బిడ్డలను మనకు ప్రసాదించిన తెలుగు తల్లి. అలాంటి తెలుగు గడ్డ పై నేటి నేతలు తీరు చూస్తే చాలా భయం వేస్తుంది. ఇక రాబోయే తరాల పరిస్థితి ఆలోచనకు వస్తేనే.. వెన్నులో వణుకు పుడుతుంది.
కేవలం ఐదు సంవత్సరాల పదవి కోసం .. అమ్మ అని పిలిచిన నాలుకతో.. ‘‘నీ... మ్మ.. , నా కొడుకు, చంపుతాం, తాట తీస్తాం, సోదిగాళ్లు, దేవత కాదు, దెయ్యం, ఇంకా చాలా బూతుపురాణం పుస్తకాలు చదువుతూ .. ప్రజల సమక్షల తిరుగుతున్న నేటి రాజకీయ నాయకులు మనకు అవసరమా?
అవినీతి రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కి , ఎన్నికల సమరంలోకి నిలబడుతుంటే.. మనం చూస్తూ ఊరుకోవాలా? ఇలాంటి బూతు నాయకులను నియంత్రించలేమా? మనం వేసే ఓటుతో గెలిచి.. చివరకు మనల్నే బూతులు తిడుతున్న ఈ బూతు నేతలకు బుద్ది చెప్పలేమా? ఒకే ఒక్క నిమిషం ఆలోచించండి? ‘‘ ఈరోజు ఎవరినో.. నా కొడుకు అన్నవాడు.. రేపు మన బిడ్డల్ని అనడని గ్యారీంటి ఏమిటి? ఇలా మనముందే.. ఇతర నాయకులపై బూతు తిడితే., ఓటు వేసిన మనల్ని రేపు ఎన్ని బూతులు తిడతాడో .. ఒక్క నిమిషం ఆలోచించండి?
ఈరోజు అమ్మ, అయ్యా, అంటూ దండాలు పెడుతూ .. మన ఇంటి ముందుకు వచ్చి నటిస్తున్న నాయకులే ..నిజమైన దొంగలు? తెరపై నటించే వారు కాదు. ఎందుకంటే.. మన భుక్తి కోసం.. ఎలా కష్టపడి సంపాదించుకుంటామో, అలాగే వారు కూడా తెరపై నటించేవారు కూడా అంతే. కానీ ఇక్కడ మనం అవినీతికి పాల్పడటంలేదు., తెరపై నటించే..నటులు అవినీతికి పాల్పడటంలేదు. ఈ విషయం అందరికి తెలుసు.
కానీ అవినీతి పేరు వినబడగానే.. ముందుగా అందరికి గుర్తుకు వస్తేది..నేటి రాజకీయ నాయకులే. ‘‘ ఒక సామాన్య రైతు తన కుటుంబం సహా 365 రోజులు కష్టపడిన.. కోటీ రూపాయాలు సంపాదించలేడ. ’’ అలాగే ఒక నటుడు కష్టపడి 5 సంవత్సరాలు షూటింగుల్లో బిజీ అయిన .. లక్షకోట్లు సంపాదించలేడు. కారణం వీరు.. తమ శక్తి ని నమ్ముకొని పని చేసుకుంటున్నారు. కానీ మన నేతలు అలా కాదు ఖద్దర్ దరిస్తే చాలు .. ధనలక్ష్మీ వారిని ఆటోమేటిక్ గా.. వరించి, వారి చేత స్విస్ ఖాత తెరిపిస్తుంది.
ఇక్క డ మనం ఆ నేతకు ఓటు వేసినందుకు.. అధిక ధరలతో మనకు నిత్యావసర వస్తువులు పుష్కలంగా లభిస్తాయి. వీటి పై ఒక్క నేత కూడా బూతు పురణం మాట్లాడాడు. కనీసం వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం పై పోరాటం కూడా చెయ్యడు. కాన మన వేసే ఓటు మాత్రం ప్రతి ఐదు సంవత్సరాలకు మాత్రం కావాలి. మన గురించి పట్టించుకోని ఈ బూతు నేతలు మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి?
ఏదైన సినిమాలో కొంచెం వల్గర్ గా ఉంటే.. ఆ సినిమా ‘ఏ ’ సర్టిఫికేట్ ఇస్తారు? పబ్లిక్ లో బూతు గురించి మాట్లాడకూడదు, బూతు సినిమాలు చూడకూడదు, బూతు పనులు చేయకూడదని, ప్రభుత్వం కొన్ని నిబంధనాలు పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఇలా ప్రజలు ముందు ప్రజా నాయకుడు బూతుపురణం చదువుతుంటే .. మనం ఏమి చేయలేమా? మనం చెవులు మూసుకోవాల్సిందేనా? ఎన్నాళ్లు, ఎన్నేళ్లు, ఇకనైనా తెలుగు యువత, తెలుగు ప్రజలు మేల్కోండి.
ఈ లాంటి బూతు నాయకులకు మన వజ్రాయుదం (ఓటు) తో బుద్ది చెప్పండి? మీరు నోటా బటన్ నొక్కి పర్వలేదు గానీ, ఇలాంటి బూతు నేతలను మాత్రం ఎన్నుకోవద్దు.., మనం మరిచిపోయి మళ్లీ ఈ బూతు నేతలను వెన్నుకుంటే.. మన బిడ్డల జీవితం, మన జీవితంలోకి అంధాకారన్ని ఆహ్వానించి నట్టే..? తెలుగు ప్రజలారా ...బీకేర్ పుల్ ..? ప్రాంతాలు వేరైన తెలుగు ప్రజలు ఒక్కటే.. , తెలుగు ప్రజలు అభివ్రద్ది .. అందరికి ముఖ్యం.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more