సీమాంద్ర నేతల్లారా మీకు భయపడకండి.. రాష్ట్రపతి మనకు వచ్చేనెల 23వ వరకు సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం సీమాంద్ర నేతలకు భరసా మాటలు వినిపించాయి. నేను రణరంగంలోకి వస్తా.. తాడో పేడో తెల్చుకుంటా.. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంద్ర మంత్రులకు భరోసా ఇచ్చారు. నిన్న అసెంబ్లీ లో సీమాంద్ర నేతలపై జరిగిన తీరు ను చూసిన సీఎం ఆవేశంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అసెంబ్లిలో చోటు చేసుకున్న పరిణామాలతో సీమాంధ్ర నేతలు అప్రమత్తం అయ్యారు. ఈరోజు అసెంబ్లిలో బీఏసీ సమావేశం నిర్వహించాలని కోరాలనుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. బీఏసీలో చర్చించిన తర్వాతనే అసెంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013పై చర్చించాలని వారు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశ పెట్టడంతో తలెత్తిన పరిస్థితిపై నేతలు చర్చించారు. ఈరోజు నాటి నుంచి అసెంబ్లీలో చర్చించాల్సిన వ్యూహంపై వారు ఒక నిర్ణయానికి వచ్చార ని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈ సమావేశంలో విభజన జరగదని మరోసారి స్పష్టం చేశారని సమాచారం, 371 డీ ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని దానికి వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. రాజ్యాంగ సవరణ ప్రస్తుత ఉన్న పరిస్థితిలో సాధ్యం కాదన్నారని చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చిందని సమావేశంలో పాల్గొన్న నేతలకు వివరించినట్లుగా తెలుస్తోంది.
ఆ లేఖను అసెంబ్లీ సభలో ప్రవేశపెడతానన్నారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు అందించారని తెలిపారంటున్నారు. ఈ లేఖలో స్పష్టంగా అన్ని క్లాజులపై వివరంగా చర్చించాలని కోరినట్లుగా ఆయన తెలిపారంటున్నారు. అసెంబ్లీలో రాష్ట్రపతి ఇచ్చిన గడువును ఉపయోగించుకోవాలని వారు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బిల్లును పార్లమెంట్కు ఆలస్యంగా పంపే విధంగా వ్యవహరిద్దామని కూడా సీఎం సభ్యులతో అన్నట్లుగా తెలుస్తోంది. సమైక్య రాగం పాడుతున్న సిఎం కిరణ్ సీమాంద్ర నేతలను ఆదుకుంటాడో, లేక అమ్మకు బలి అర్పిస్తాడో చూడాలని సమైక్యావాదులు అంటున్నారు. సమైక్య సమరం నేడు అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ఉంటుందని సీమాద్ర నేతలు అంటున్నారు. ఎలాగైన రాష్ట్ర విభజన అడ్డుకోవాలని నేతలు మరోసారి గట్టిగా అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు జరిగే అసెంబ్లీ సమారం లో ఎవరిది గెలుపు చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more