గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించే చర్చ. ఆయన రాజీకీయాల్లోకి రాబోతున్నాడంటూ, రీ ఎంట్రీ ఇచ్చి టీడీపీలో చేరబోతున్నాడని, అందుకు తెర వెనక బాలయ్యతో చర్చలు కూడా జరిగాయని, త్వరలో పవన్, ఆయన అన్న నాగబాబు చేరడమే తరువాయి అని ఇలా రకరకాల వార్తలు సంచరించినా పవన్ మాత్రం మీడియా ముందుకు వచ్చి స్పందించలేదు. మీడియా ముందుకు చాలా తక్కువ సందర్భాల్లో వచ్చే పవన్ ఇలాంటి వాటి పై స్పందించరని అనుకున్నారంతా.
కానీ ఆయన బదులు సినీ నటుడు పోసాని మురళీ క్రిష్ణ స్పందించి... పవన్ రాజకీయాల్లోకి రాడని తేల్చేశాడు. గతంలో పోసాని ఒక ఇంటర్యూలో రాష్ట్ర రాజీకీయాలు ఓ వ్యభిచారంలా తయారయ్యాని చెప్పుకొచ్చిన ఆయన ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి వచ్చి కలుషితం అపోవడం తప్ప మరేమి ఉండదని, ఓట్లేసే ప్రజల్లో సైతం నిజాయితీ లోపించిందని, ఇలాంటి టైంలో రాజీయాల్లోకి వచ్చినా తనను ప్రక్షాళన చేసుకొని, నిరూపించుకునేది ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.
తన అన్నయ్య స్థాపించిన పీఆర్పీ పార్టీలో ‘యువ రాజ్యం ’ అద్యక్షుడిగా ఉన్న పవన్ ఆ పార్టీ విలీనం తరువాత తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. నటుడు, దర్శకుడు, రచయిత అయిన పోసాని పవన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన మనస్సును తెలిసిన వాడిగా, ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖచ్చితంగా చెప్పగలనని పోసాని చెప్పుడు.
మరో వైపు మెగా బ్రదర్స్ టీడీపీలో చేరుతున్నారన్న వార్తల పై నాగబాబు కూడా ఖండించాడు. తాము ఏ పార్టీలో చేరడం లేదని, అసలు రాజకీయాల్లోకే రావడం లేదని, ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదని, టీడీపీలో చేరడానికి మేము రామోజీని, బాలక్రిష్ణను కలవలేదని నాగబాబు తన పీఆర్ఓ ద్వారా చెప్పించారు. ఇటు నాగబాబు, అటు పోసాని ఇద్దరు కూడా వార్తలన్నీ అసత్యమేనని తేల్చారు. ఇప్పటికైనా ఈ వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more