ఈ నెల 27, 28 తేదిల్లో మహానాడును హైద్రాబాద్ లో నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తోంది టిడిపి అధినాయకత్వం. ఇదే అంశంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ పార్టీ నేతలు. రానున్న కాలంలో ఏ రకమైన కార్యాచరణను అనుసరిస్తే పార్టీ బలోపేతం అవుతోందనే విషయమై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర విజయవంతం కావడంతో జోష్ లో ఉన్న టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బస్సు యాత్రను చేపట్టాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. బస్సు యాత్రకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఇన్ చార్జ్ పదవులను భర్తీ చేయాలని బాబు నిర్ణయించారు. పాదయత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా పార్టీ సీనియర్లతో బాబు తన నివాసంలో సమావేశమయ్యారు.
తాజా రాజకీయాంశాలతో పాటు భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి సమావేశంలో చర్చ జరిగింది. జనంలో పార్టీని మమేకం చేయగలిగితే పార్టీకి ఇబ్బంది ఉండదని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. నాయకులు వలసలు వెళ్ళిన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. పాత నాయకులు పార్టీని వీడిన స్థానాల్లో యువరక్తాన్ని నింపితే పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇమడలేకపోతున్న నాయకులను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేయాలని బాబు సూచించారు.
రెండో దఫా మండలి సభ్యత్వం పునరుద్దరించకపోవడంతో అలకబూనడాన్ని పార్టీ నాయకులు తప్పుబట్టారు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించింది జగనేనని ప్రతి రోజు విమర్శించిన నాయకుడు ఇవాళ ఆ పార్టీలో చేరడాన్ని ఎలా సమర్థించుకొంటారని టిడిపి ప్రశ్నిస్తోంది. మహానాడు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. మహానాడు నాటికి ఖాళీగా ఇన్ చార్జ్ పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. అప్పటికీ పూర్తికాకపోతే బస్సు యాత్ర చేసే సమయానికైనా ఇన్ చార్జ్ పదవులను భర్తీ చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను తీసుకొని క్షేత్రస్థాయిలో నాయకులు పోరాటాలు చేయాలని బాబు సూచించారు.ఈ నెల 27,28 తేదిల్లో హైద్రాబాద్ లో మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. 10 వేల మందితో ప్రతినిధులను మహానాడుకు ఆహ్వానించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more