ఈరోజు హైద్రాబాద్ బెంగళూర్ హైవే మీద సడక్ బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అయినా ఈ కార్యక్రమాన్ని చేస్తామని, దిగ్విజయం కూడా చేస్తామని తెలంగాణా ఆందోళనకారులంటున్నారు. హైవే లమీద దిగ్భంధానికి సుప్రీం కోర్టు అనుమతి లేదని అందువలన అనుమతి ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఫిబ్రవరిలోనే చెయ్యవలసిన కార్యక్రమం ఆగిపోయినందుకు ఎలాగైనా అనుకున్న ఈ కార్యక్రమాన్ని చేసి చూపించాలని తె.ఐకాస భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మూడు రోజుల క్రితం శాసనసభలో తెరాస పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జరిగిన వాడి వేడి మాటల తూటాల పేల్పుల ప్రభావం ఈ సడక్ బంద్ మీద పడేటట్టుగా కనిపిస్తోంది. ముక్కు పిండి సాధించుకుంటాం, కాలర్ పట్టుకుని తెలంగాణాకు కావలసింది తెచ్చుకుంటాం లాంటి మాటలకు మనసు నొచ్చుకున్న ప్రభుత్వం (ముఖ్యంగా ముఖ్యమంత్రి) ఈ ఆందోళనను గట్టిగా ప్రతిఘటించాలని చూస్తోంది. ఉత్సాహంతో ఉరకలు వేసే యువతతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి చూసినవా చెప్పింది చేసినం, అనుకుంది సాదిస్తం అనటానికి తెలంగాణా ఆందోళనకారులు చూస్తున్నారు. ఎప్పుడేం చెయ్యాలో మాకు తెలుసు, మీరు చెప్తేనే చేస్తామా అన్న ముఖ్యమంత్రి మాటలకు కార్యరూపమిద్దామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ పోరాటంలో నిజంగా నలిగి పోయేది ఒకపక్క ఉద్యమంలో పాల్గొంటున్న యువత, మరోపక్క పోలీసులు మాత్రమే. కఠినంగా ప్రవర్తిస్తే ఆణచివేతగా చూపిస్తారు, మెత్తగా ఉంటే ఎంతైనా చేస్తారు, తర్వాత ఎన్ని మాటలైనా అంటారు కాబట్టి మధ్యేమార్గాన్ని అవలింబించటానికి చూస్తూ వచ్చారు ఇన్నాళ్ళూ కానీ ఇప్పుడు అనుమతి లేని ఉద్యమ కార్యక్రమాన్ని అణచివేయమని ప్రభుత్వం చెప్తోంది.
తెలంగాణా వాదంలో ఉన్న రాజకీయనాయకులకు ఎలాగైనా పైచేయే అవుతుంది. ఏమీ చెయ్యనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటే ఉద్యమాన్ని అణచివేస్తున్నారు, మా హక్కలను కొల్లగొడుతున్నారనవచ్చు. చెయ్యనిస్తే అది ఎంత వరకు పోతుందో తెలియదన్న సంగతి టాంక్ బండ్ మీద విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతం చెప్తోంది. ప్రజలు వాళ్ళ మనోభావాలను ఈ విధంగా తెలియజేసారు చూసారా అంటారు. ఇప్పుడు జరిగిన నష్టం చూస్తున్నరు కానీ, బలిదానాలు కనపడలేదా అని కూడా అంటారు. ముందు అనుకుంటున్నట్టుగా పోలీసులు కఠినంగా ప్రవర్తించినట్లయితే అవి నిరసనలకు దారితీస్తాయి, తెలంగాణా వాదాన్ని బలంగా బలపరుస్తున్న కార్యకర్తల హృదయాలలో లోతైన ముద్రలు వేస్తాయి. హింసాత్మక చర్యలకు దోహదం చెయ్యవచ్చు. ఇంకా ఎంతకాలం ఈ అణచివేత అని అనటానికి కూడా తెలంగాణా నాయకులకు ఆస్కారం ఏర్పడుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more