నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర మఖ్యమంత్రిగా చేయవలసి వచ్చింది. రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదు. ప్రజా బలం అస్సలు లేదు. అయిన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు శత్రువులుగా మారిపోయిన విషయం తెలిసిందే. డిల్ రవింద్ర రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి, శంకర్ రావు లాంటి వారు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన తమ్ముళ్లను తెర వెనుక పెట్టుకొని అన్నీ నడిపించడం మొదలుపెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి తో ఒక్క మంత్రి కూడా కలిసి రాకపోయిన ముందుకు పోతునే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయటం నేర్చుకున్నారు. నిరంతరంగా 53 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెను సైతం కిరణ్ కుమార్ రెడ్డి నిలుపుదల చేశారు. సొంత నియోజక వర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాకపోయిన , సోనియాగాంధీ దగ్గర మార్కులు కొట్టేశారు. తనకు శత్రువులుగా మారిన నాయకుల నోర్లు మూయించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరెస్ట్ చేయించి, ఒక గట్టి నాయకుడుగా రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల్లోకి కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెట్టి.. ప్రజా నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు నడిపించారు. అంతేకాకుండా మీడియాపైన కూడా సీఎం పట్టుసాధించారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మీడియా లేదని ప్రచారం జరిగిన చోటే ..కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పే స్థాయికి కొన్ని ఛానల్స్ ను ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నాయి. ఐ న్యూస్ , ఏ టీవీ లాంటిని కాంగ్రెస్ పార్టీ కి ప్రచార సాధనాలుగా చేసుకున్నారు. అంతేకాకుండా.. తనకు అడ్డుగా ఉన్నవారిని చాకచక్యంగా తప్పించటంలో ముఖ్యమంత్రి నేర్పరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో మరో నాయకుడుగా ఎదుగుతున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పై లిక్కర్ కేసులు బనాయించి.. అతన్ని రాజకీయంగా ఎదకుండా చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. మంత్రులతో సమావేశాలు లేకుండానే కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెట్టి, రాష్ట్రంలో తన బలాన్ని బలపరుచుకున్నారని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. సీఎం బలపడుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయిందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరా పరాజయం జరిగింది. 17 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ..15 చోట్లు ఘోరంగా ఓడిపోయింది. కరెంట్ చార్జీలు పెంచటంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు దూరమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా .. ముస్లిం ఎమ్మెల్యేను అరెస్ట్ చేయటంతో.. ముస్లిం ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ముస్లిం పెద్దలు అంటున్నారు. ఢిఎల్ రవీంద్ర రెడ్డి , పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, శంకర్ రావులు కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేక ప్రచారం చేయటంతో .. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరమైనట్లు తెలుస్తుంది. ఇటీవల దళిత మంత్రి శంకర్ రావు అరెస్ట్ చేయటంతో .. ఎస్సీల ఓటు బ్యాంకు కాస్త చేజారిపోయిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాష్ట్రం పై ఏ నిర్ణయం అయిన మంత్రులకు తెలియకుండా కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవటం, మంత్రులకు తెలియకుండా కొత్త పథకాలను ప్రవేశపెట్టడం లాంటి చేయటంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడినట్లు
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more