ప్రజల వద్దకే పరిపాలన అంటూ... రాష్ట్రంలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ఇప్పుడు గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఉండటంతో.. గుంటూరు జిల్లాలో ఒక్క పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ పై విచిత్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజల వద్దకు కాంగ్రెస్ నాయకులు నేరుగా వెళితే చెయ్యి విరగ్గొట్టి పంపడం ఖాయమని ఆయన అన్నారు. ఆ భయంతోనే సహకార సంఘాల ఎన్నికల్లో పరోక్ష పద్దతుల్లో గట్టేక్కిందని ఆయన ద్వజమెత్తారు. పార్టీ కోసం పాదయాత్ర చేస్తూ కష్టపడుతున్న చంద్రబాబు ను చూడటానికి ఆయన బావమరిది , నటుడు నందమూరి బాలయ్య గుంటూరు జిల్లాలోని వేమూరు చెరుకున్నారు. అయితే అక్కడ బాలయ్యకు ఒక విచిత్రమైన చేదుఅనుభవం ఎదురైంది. బావ కోసం బావమరిదికి ఇలా చేదుఅనుభవం అవ్వటం ఇదే మొదటిసారి. చంద్రబాబును కలవకుండా పోలీసులు బాలయ్యను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మరో 48 గంటల పాటు బాబును కలిసేందుకు అనుమతించబోమని పోలీసులు గట్టిగా చెప్పారు. మీరు అంతాగా మీ బావను కలవాలంటే ఒక్కటే మార్గం ఉందని పోలీసులు ఉచిత సలహా చెప్పారు. దీంతో బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. కానీ బావ బస్సులో నుండి కనుసైగలు చేయటంతో బాలయ్య శాంతించినట్లు తెలుస్తోంది. మీరు మీ బావను ఒక్కసారి కలిస్తే.. రెండు రోజులూ పాటు మీ బావతోనే బస్సులో ఉండాల్సి వస్తుందని బాలయ్యకు పోలీసులు సూచించారు. బాలయ్యకు ఏం చేయ్యలో అర్థంగాక అయోమయంలో పడి అటు ఇటు తిరుగుతూ ఇలా ఎందుకు చేస్తున్నారని పోలీసులను శాంతియుతంగా అడిగినట్లు సమాచారం. పోలీసులు.. బాలయ్య అడిగిన ప్రశ్నకు కూల్ గా ... ఎన్నికల కోడ్ ఉన్నది, కాబట్టి బాబు గారి కలవటం కుదురదని కచ్చితంగా చెప్పారు.
బాలయ్య విషయంలో లోకల్ నాయకులు రంగంలోకి దిగి పోలీసులకు చెప్పిన వారు ససేమిరా అన్నారు. అసలు నిజానికి , ఎన్నికల కోడ్ పరిధిలోకి కుటుంబసభ్యులు రారు. ఈ విషయాన్ని పోలీసులు ఎలా మరిచిపోయా బాలయ్యతో వివాదం ఎలా పెట్టుకున్నారు? ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పోలీసులకు గుర్తు చేసిన వారు వాటిని పట్టించుకోలేదు. అయితే దీన్ని టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్ ఎస్ . సురేష్ కుమార్ ద్రుష్టికి తీసుకువెళ్లటంతో.. కలెక్టర్ సానుకూలంగా స్పందించి.. బాలయ్య ఈ రోజు 8 గంటల తరువాత బాబును కలిసేందుకు బాలయ్యకకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. తన సొంత బావను కలవాటానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని కలలో కూడా బాలయ్య బాబు అనుకోలేదని టీడీపీ నాయకులుతో బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. బావ ను కలిసిన బాలయ్య తనకు జరిగిన చేదుఅనుభవం గురించి చెమట్లు పట్టే వరకు చెప్పటంతో.. బావ, బాలయ్య పడుతున్న అవస్థ చూసి .. బూస్ట్ ఇవ్వటంతో.. బాలయ్య శాంతించటం జరిగిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. బావ బూస్ట్ తాగిన బాలయ్య ఆనందంగా బయటకు వచ్చి .. ప్రజలకు అభివాదం చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more