Ed slaps rajasthan royals with rs100 crore notice

Rajasthan Royals, IPL, Indian Premier League, cricekt, ED, sports

The Enforcement Directorate (ED) has slapped a penalty notice of approximately Rs 100 crore against IPL team Rajasthan Royals for allegedly violating forex laws in its business operations

ED slaps Rajasthan Royals with Rs.100 crore notice.png

Posted: 02/05/2013 11:28 AM IST
Ed slaps rajasthan royals with rs100 crore notice

shilpa_shetty

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజస్థాన్‌కు దా దాపు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు రాజస్థాన్ యాజమాన్యానికి ఈడీ నోటీసు జారీ చేసింది. రాజస్థాన్ జట్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా ఉన్నారు. వ్యాపార కార్యకలాపాల్లో విదేశీ మా రక ద్రవ్య చట్టాలను అతిక్రమించిందనే ఆరోపణలపై ఈడీ రెం డేళ్లు పాటు విచారించింది. విదేశీ పెట్టుబడులను అక్రమ మార్గా ల ద్వారా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య సంస్థ జైపూర్ ఐపీఎల్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఐపీఎల్)కు మళ్లించారని ఈడీ విచారణలో తేలింది. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీకి వేర్వేరుగా మూ డు నోటీసులు పంపించినట్టు అధికార వ ర్గాలు తెలిపాయి. జేఐపీఎల్ దాని డైరెక్టర్లకు 50 కోట్లు పెనాల్టీ విధించింది. విదేశీ సుంకం ఎగ్గొట్టినందుకు మారిషస్‌కు చెందిన ఈఎమ్ స్పోర్టింగ్ హోల్డింగ్, దాని డైరెక్టర్లకు 34 కోట్లు జరిమానా వేసింది. గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఐపిఎల్‌కు చెందిన అన్ని ప్రాంఛైజ్‌లకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన లాంటి వాటిపై విచారణ జరుపుతూ వస్తోంది. అయితే ఇంత భారీగా ఏ జట్టుకైనా జరిమానా విధించడం మాత్రం ఇదే

rajasthan-royals

ఈడి తొలిసారిగా రాయల్స్‌కు 2011 మధ్యలో జరిమానా విధించగా, దానిపై ఢిల్లీలోని ఫెమా అథారిటీ ఈ కేసును విచారించి ఇప్పుడు తుది ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ 24 షో కాజ్‌ నోటీసులు జారీచేసింది. ఇందులో వివిధ ఐపిఎల్‌ ప్రాంఛైజ్‌లు సుమారు 2000 కోట్ల రూపాయాల మేరకు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. రాజస్తాన్‌ రాయల్స్‌లో బాలీవుడ్‌ నటీమణి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా ఉన్నారు. తొలి ఐపిఎల్‌ చాంపియన్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచిన విషయం తెలిసిందే. దీని పై స్పందించిన యాజమాన్యం ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అ ప్పీలు చేయనున్నట్టు పేర్కొంది. ఈడీ నుంచి తాము నోటీసులు అందుకున్నట్టు ద్రువీకరించింది. ఈ విషయంపై న్యాయవాదులతో చర్చిస్తున్నామని, ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Regional development council on telangana
Football matches under match fixing cloud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more