23 ఏళ్ల అమానత్ బతకాలని కోరుకుందని ఆమెకు సన్నిహితంగా ఉన్న వారు తెలిపారు. అమానత్ బతకాలని ఉందని.. తనను హింసించిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరుకుంటున్నట్లు ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం ఈ నెల 19న ఆమెను కలిసిన సోదరుడు, తల్లితో బాధితురాలు తెలిపినట్లు చెప్పారు. ఢిల్లీలోని సప్థర్ జంగ్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చేతులతో సైగలు చేస్తూ తల్లిదండ్రులతో గడిపేదని తెలిపారు. మెజిస్ట్రేట్ ముంద కూడా ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చిందని చెప్పారు. మానసిక వైద్యుల ముందు తన భవిష్యత్ ఆలోచనలను కూడా చెప్పిందని తెలిపారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అమానత్ చనిపోయింది. ఆమె మరణం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి? ఆమె మరణం వార్త తెలిసి దేశం ప్రజలు బాధతో సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి షిలీ దీక్షిత్ చాలా సిగ్గుపడుతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి మరణం పట్ల సిగ్గు పడుతున్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. అత్యాచార బాధితురాలి మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత శాంతియుతంగా ఉండాలని ఆమె కోరారు. ఢిల్లీలో మహిళలకు రక్షణ ముందే కల్పించి ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని రాజకీయ నాయకులు అంటున్నారు. ఇకనైన ఈ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఆమె మరణం పై కొంత మంది డాక్టర్లు పలు రకాలుగా చెబుతున్నారు.
గ్యాంగ్ రేప్ బాధితురాలని సింగపూర్ తరలించడం సరైంది కాదా ..? అలా తరలించడం ఘోర తప్పిదమా.. ? మెరుగైన వైద్యం కోసమే తరలించారా..? లేక సింగపూర్ తరలించడం వెనుక రాజకీయ కోణం ఉందా..? వైద్య నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమానత్ను సింగపూర్ తరలించడం వెనుక రాజకీయ కోణం దాగుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి..దేశరాజధాని ఢిల్లీ నడివీధుల్లో గ్యాంగ్ రేప్ కు గురైన అమానత్ ను సింగపూర్ తరలించడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది..మెరుగైన వైద్యం పేరుతో గ్యాంగ్ రేప్ బాధితురాలిని సింగపూర్ తరలించడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్న వాదనలు బలంగావినిపిస్తున్నాయి..బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికి , కేంద్ర ప్రభుత్వం ఆమెను సింగపూర్ తరలించడాన్ని వైద్యనిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.అమానత్ సింగపూర్ తరలించే సమయంలో ఇన్ఫెక్షన్ సోకి, పూర్తిగా వెంటలేటర్ పైనే ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆమెను సింగపూర్ ఎలా తరలిస్తారని సర్ గంగారాం ఆసుపత్రికి చెందిన అవయవ మార్పిడి, గ్యాస్ట్రో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సమీరన్ నంది ప్రశ్నిస్తున్నారు...విమానంలో ఆరు గంటలపాటు ప్రయాణించాల్సి రావడం వల్ల బాధితురాలు మెడికల్ ట్రామాకు గురై ఉంటుందని సమీరన్ అభిప్రాయపడ్డారు.. ఎయిమ్స్, జి.బి. పంత్, సఫ్దర్జంగ్, సర్ గంగారామ్ ఆస్పత్రుల్లోని వైద్య నిపుణులు సమీరన్ అభిప్రాయంతో ఏకీభిస్తున్నారు. అమానత్ ను సింగపూర్ తరలించడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలకు వైద్య నిపుణుల అభిప్రాయాలు బలం చేకూర్చుతున్నాయి... ఢిల్లీలో చికిత్స కొనసాగిస్తే ఆందోళనలు అదుపు చేయలేమన్న కోణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ... ఈ నిర్ణయం తీసుకొని ఉంటారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more