ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సుశీల్ కుమార్ షిండే సమక్షంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో రాష్ట్రం నుండి ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తెలంగాణ సమస్య పై ఎనిమిది పార్టీల రాజకీయ నాయకులు విభిన్నమైన స్వరం వినిపించారు. ఈ సమావేశం లో ముఖ్యఅతిథిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం విశేషం. కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్షం పై ఒక సుదీర్ఘమైన తీర్పు చెప్పారు. తెలంగాణ సమస్య కు 30 రోజులు సమయం కావాలని అన్ని పార్టీలకు చెప్పటం జరిగింది. ఈ తీర్పు విన్న టీఎస్ఆర్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు, అసంత్రుఫ్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్వహించిన తీరుకు నిరసనగా .. ఈ రోజు తెలంగాణ బంద్ పాటిస్తున్నారు. అయితే కేంద్రం ఆలోచనలపై కాంగ్రెస్ నాయకులు ఆనందంగా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు మండిపడతున్నారు. దీని పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయాని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ను ఆపటం ఇక ఎవరి తాత వల్ల కాదు. తెలంగాణను సాధించుకోని తీరుతామని కెకె ఆవేశంగా అన్నారు. తెలంగాణ కోసం మేము పోరాటం చేస్తామని ఆయన అన్నారు. అయితే కేంద్రం తెలంగాణ పై ఆర్థిక ప్యాకేజీలు, ప్రత్యామ్నాయం ఇవ్వటం ఇక మానుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం అఖిల పక్షంలో ఇచ్చిన హామీ ప్రకాకం జనవరి 30వ తేదీలోపు తెలంగాణను ప్రకటించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షాలు అర్థం చేసుకున్నందకు వారికి అభినందనలని కెకె అన్నారు. కేంద్రం రాష్ట్ర రాజకీయ పార్టీలన్ని చెప్పిన తరువాత మళ్లీ తిరగేసే ప్రయత్నం చేస్తే బాగుండదని కేకె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలను చవి చూడాల్సి ఉంటుందని కెకె అన్నారు. కెకె మనసును తెలుగు దేశం పార్టీ గెలుసుకుందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా తెలిపిందని అందుకు నాకు చాలా ఆనందంగా ఉందని కెకె అన్నారు. 2013లో తెలంగాణ వస్తుందని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more