ఉప రాష్ట్రపతి కి అనుకోని అవమానం సభలో ఎదురైంది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ పై బీఎస్సీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. అన్సారీ సభను నడపటంలో విఫలమయ్యారని ఆమె మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సభలో కనిపించడం లేదని ఉప రాష్ట్రపతి ని మాయావతి తప్పుబట్టారు. అంతేకాకుండా తీవ్ర పరిణాలు చవి చూడాల్సి ఉంటుందంటూ ప్రభుత్వానికి హెచ్చరిచారు. అసలు ఆమె ఆగ్రహానికి కారణం ఏమిటి? అంటే ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ. ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చర్చ వాయిదా పడుతుండటమే ఆమె కోపానికి కారణం అని ఇతర పార్టీ నాయకులు అంటున్నారు. మాయావతి తీరుపై కొన్ని పార్టీ నేతలు తప్పుబట్టారు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని మాయావతి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లు ఆమోదాన్ని షరతుగా విధించి ఎఫ్ ఢీ ఐ లపై ఓటింగ్ లో ప్రభుత్వాన్ని ఆమె గట్టెక్కించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆమె ఒత్తిళ్లకు తలొగ్గి, రాజ్యసభలో కోటా బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లును సమాజ్ వాది తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజ్యసభ కార్యకాలపాలను అడ్డుకుంటోంది. అటు వాల్ మార్ట్ నివేదిక, ఇటు ఎస్పీ, బీఎస్పీ ఆందోళనతో గత కొద్ది రోజులుగా రాజ్యసభ స్తంభిస్తోంది. ధీంతో, మధ్యాహ్నానికే సభను తర్వాతి రోజుకు వాయిదా వేయాల్సి వస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తన ముడుపు ను రాబట్టుకునేందుకు ఎత్తువేశారు. చాలా రోజుల తరవుత సభ చాలా ప్రశాంతంగా సాగుతోంది.
అయితే సభలో మంత్రి ఆనంద్ శర్మ సభ్యుల పశ్నలకు బదులు ఇస్తున్నారు. ఆ సమయంలోనే పార్టీ ఎంపీలతో కలిసి మాయావతి రాజ్య సభలోకి దూసుకొచ్చారు. తన సీట్లో కూడా కూర్చోకుండానే చైర్మన్ హమీద్ అన్సారీ పై నిప్పులు కురిపించారు. సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నడవడం లేదు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి . మీరు సభకు చైర్మన్. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత మీదే. కానీ, మీరే కనిపించడం లేదు 12 గంటల తరువాత సభను నిర్వహించడ లేదు. ఇదేమి సభ..? అంటూ ఆమె మాటలోతో ఉప రాష్ట్రపతి పై రెచ్చిపోయారు. మాయావతి ని శాంతింపజేసేందుకు అన్సారీ ప్రయత్నించిన వినిపించుకోలేదు. మాయావతి నేనేమీ వినను. మీరు సభను సజావుగా నడిచేలా హామీ ఇవ్వాల్సింది అని ఆయన్నీ నిలదీశారు. ఈ సంఘటనలో నిర్ఘాంతపోయిన అన్సారీ సభను సజావుగా నడిపించే భాద్యత ప్రతి ఒక్కరిదీ అని ఆయన చెప్పారు. మీరు సీనియర్ నాయకురాలు ఇలా మాట్లాడటం బాగాలేదని ఆయన అన్నారు.ఇలా అయితే కష్టం ? మాయావతి తీరుతో నిశ్చేష్టుడైన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ .. ఇటువంటి పరిస్థితుల్లో పని చేయటం కష్టమని వ్యాఖ్యనించారు. నేను చాలా వ్యాకులతకు లోనయ్యాను. ఇటు వంటి పరిస్థితుల్లో విధులు నిర్వర్తించడం కష్టం అన్నట్లు ఆయన అన్నారు. సభ వాయిదా పడిన తర్వాత, వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశమయ్యారు. వారితో రాజ్యసభలో మాయావతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. మాయావతి తీరుపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more