దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక ఘట్టానికి తెరలేచింది. పెను సంచలనంగా మారిన ఈ కేసులో నత్తనడకన దర్యాప్తు సాగుతుందని పోలీసులు విమర్శలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుల గుర్తింపు ప్రక్రియ (టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్)ను నిర్వహించారు. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను చంచల్ గూడ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు.
న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ను అమె గుర్తుపట్టారు, అక్కడి నుంచి సైదాబాద్లోని జువైనల్ హోంకు తీసుకొచ్చి ఐదుగురు మైనర్ బాలుర గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. నిందితులందరినీ మైనర్ బాలిక గుర్తించింది. బాధితురాలు తెలిపిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. మరోవైపు అత్యాచారం కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారి డీఎన్ఏ సేకరించడానికి అనుమతివ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, అందుకు అనుమతి లభించింది. నిందితుల డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నారు.
అత్యాచారం జరిగిందని పోలీసులు చెబుతున్న ఇన్నోవా వాహనంలో క్లూస్ టీం ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది. డీఎన్ఏ నివేదికతో ఇన్నోవా వాహనంలో దొరికిన ఆధారాలను పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారని పక్కాగా నిరూపించడానికి పోలీసులకు డీఎన్ఏ నివేదిక ఎంతో కీలకం కానుంది. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించేందుకు కోర్టు అనుమతి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మైనర్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నిందితులు విదేశాలకు పారిపోకుండా ముందస్తు జాగ్రత్తగా వారి పాస్పోర్టులను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more