ప్రముఖ వ్యాపారదిగ్గజం.. మహీంద్రా గ్రూప్ ఆప్ కంపెనీస్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండారని తెలుసు. ఆయన తనదైనశైలిలో పలు వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకుంటారని కూడా తెలుసు. ఇందులో మనస్సును హత్తుకునేవి, మానవత్వంతో స్పందించేవి కూడా చాలనే ఉన్నాయి. అటో విడిభాగాలతో జీపును తయారు చేసిన వారికి బోలెరో వాహనాన్ని ఇవ్వడం కానీ.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కాళ్లు చేతులు లేని దివ్యాంగుడికి తన సంస్థలో ఉద్యోగం కల్పించడం ఇలా పలువురికి తన సంస్థ తరపున చేయగలిగినంత చేస్తారాయన.
అలాంటి ఈ పారిశ్రామిదిగ్గజానికి ఓ నెటిజన్ నుంచి ఎదురైన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలోనే బదులిచ్చారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తే ఆయన ఆనంద్ మహీంద్రా ఎందుకు అవుతారు.? అందుకనే ఆయన సమాధానం కూడా చమత్కారంగా.. ఇచ్చారు. తానడిగిన ప్రశ్నకు ఇలాంటి సమాధానం లభిస్తుందని బహుశా ఆ నెటిజన్ కూడా ఊహించిఉండకపోవచ్చు. వైభవ్ అనే నెటిజన్.. సర్... మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటూ ట్వీట్ చేశాడు. అందుకు ఆనంద్ మహీంద్రా స్పందించారు. "నిజం చెప్పాలంటే... నేనిప్పుడున్న వయసులో ఏ యోగ్యతకైనా అనుభవం మాత్రమే అర్హత" అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా సమాధానం అనేకమంది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అదే సమయంలో, ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ చర్చకు కారణం ఓ బాలిక ఫొటో. హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతంలో ఓ గుట్టపై కూర్చుని చదువుకుంటున్న ఆ బాలిక ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభిషేక్ దూబే అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు. దానిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ఈ ఫొటో ఎంతో బాగుందని, ఆ బాలికను తాను ప్రేరణగా తీసుకుంటానని వెల్లడించారు. ఈ క్రమంలోనే వైభవ్ అనే నెటిజన్ ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more