కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సభలో అపశృతి చోటుచేసుకుంది. అంబేద్కర్ జయంతి వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై.. ప్లడ్ టైట్లు, పైకప్పు (ఉక్కు మాస్ట్) కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, కేంద్ర మంత్రి తృటితో తప్పించుకున్నారు. దీంతో అధికారగణం ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. అంబేత్కర్ జయంతి వేడుకల్లో వేదిక కూలిపోవడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితి తలెత్తింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆగ్రాలో అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వేదికపైన ఎక్కువ మంది ఉండటంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో స్టేజీకి పైకప్పుతో పాటు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసిన మాస్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. వేదకిపైనున్న నేతలపైన మాస్ట్ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో కేంద్రమంత్రి వేదికపై పడిపోయారు. స్ధానిక పోలీసులు, భద్రతా సిబ్బంది కిందపడిన ఆయనను పైకిలేపారు.
ఆయనకు గాయాలేవీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వేదికపైన ఎక్కువ మంది ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈదురు గాలులు వీయడంతో లైట్లు అమర్చిన ఇనుప మాస్ట్ కుప్పకూలిందని నిర్వాహకులు పేర్కోన్నారు. ఘటనలో మరణించిన మృతుడు స్థానికంగా నివాసముంటున్న రాజేష్ కుమార్ (50)గా గుర్తించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Organiser of the event also got injured. #Agra pic.twitter.com/nXpoI8MSpj
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more