రాజస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని అధికార బీజేపి నేతల దాడుల్లో దళితల మహిళలు సమిధలు అవుతున్నారని అందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అలాంటి నేరాలపై తమ పార్టీకి చెందిన రాజస్థాన్ మంత్రి దారుణ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. ఇటీవల దేశంలో అత్యాచారాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచిన విషయమై అసెంబ్లీలో చర్చ సాగగా.. దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్.
ఈ మేరకు ఆయంన అసెంబ్లీలో మాట్లాడుతూ..."రేప్ కేసుల్లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే రాజస్తాన్ పురుషుల రాష్ట్రం." అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు శాంతి ధరివాల్ మహిళలను అవమానించడమే కాక పురుషుల గౌరవాన్ని దిగజార్చారని సతీష్ పూనియా ఆరోపించారు. ఈమేరకు షెహజాద్ ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్ లైన్లో తెగ వైరల్ అవుతోంది.
తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తుండడంతో ఎట్టకేలకు రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్ ఎట్టకేలకు వెనక్కుతగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నిరసనల మధ్య ఆయన తాను చేసిన వ్యాఖ్యలకు నిండుసభలో క్షమాపణలు కోరారు. తాను నోటి నుంచి అనవసరంగా మాట జారారని మన్నించమని కోరారు. ‘‘నా నోరు జారి.. నేను చేసిన వ్యాఖ్యలకు మన్నించమని కోరుతున్నారు. నేను నిత్యం మహిళలను ఎంతగానో గౌరవిస్తాను. కానీ నిన్న నేను ఏదో చెబుదామనుకొని.. ఏదో చెప్పి మహిళలు గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించానని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే వారికి తాను క్షమాపణలు చెబుతున్నాను’’ అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more