దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోంటోంది. పార్టీ నుంచి విడిపోయిన పలుకుబడి కలిగిన నేతలు ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేయడం.. వాటితో కాంగ్రెస్ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జాతీయంగా కాంగ్రెస్ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుండగా, జాతీయ స్థాయి సీనియర్ నేతలు మాత్రం పార్టీకి దూరం అవుతూనే వున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి పంపారు.
ఆ లేఖలో ఆయన తాజా పరిణామాలు, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదంగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో తనకు లభించిన గౌరవానికి సోనియాగాంధీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీతో తనకున్న 46 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈయనకు బీజేపి మిత్రపక్షమైన అమరేందర్ సింగ్ పార్టీ వల విసిరిందని గుసగుసల వినిపిస్తున్నాయి.
అనంతరం అశ్వని కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా బాధకరమైన విషయమని అన్నారు. ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆత్మగౌరవానికి అనుగుణంగానే పార్టీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోలేకపోయిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం క్షీణిస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ నిర్ణయాల వల్ల ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే, తాను పార్టీని మాత్రమే వీడానాని క్రియాశీల రాజకీయాలను కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల కోసం తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటానని తెలిపారు. కాగా, అశ్వని కుమార్ యూపీఏ హయంలో అక్టోబర్ 2012 నుండి మే 2013 వరకు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 2011 జనవరి నుంచి జూలై వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more