దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది. ఈ క్రమంలో దేశంలో రోజువారీ కేసుల రెండు లక్షల 56 వేల మేరకు నమోదయ్యాయి. ఆదివారం నాటి కేసుల కంటే ఇవి 4.43 శాతం తక్కువని అధికారులు తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులు కూడా 16,56,341 దాటడంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 2,58,089 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసులు 3,73,80,253కి చేరాయి. ఇందులో 3,49,33,981 మంది కోలుకున్నారు. మరో 16,56,341 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,86,451 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 385 మంది మృతిచెందగా, 1,51,740 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా అధికమవుతున్నది. నిన్న 16.28 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 19.65 శాతానికి చేరిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 158.12 కోట్ల కరోనా వ్యాక్సిడ్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో నానాటికి పెరుగుతున్నాయి.
దీంతో మూడు వారాల వ్యవధిలో రోజువారీ కేసులు రెండున్నర లక్షలకు చేరువయ్యాయి. ఇక అదే సమయంలో దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా అధిమవుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ బాధితులు 8209కి చేరారు. ఇందులో 3109 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1738 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో 1672, రాజస్థాన్లో 1276, ఢిల్లీలో 549, కర్ణాటకలో 548, కేరళలో 536 చొప్పున కేసులు ఉన్నాయి. దేశంలోని 120 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివ్ రేటు కూడా స్వల్పంగా తగ్గింది. తాజాగా 14.41గా పాజిటివిటీ రేట్ నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more