దేశంలో నూతన సంవత్సరం వేడుకల వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి మూడవదశ ముపుతో విరుచుకుపడుతోంది. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని కూడా ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. వారి అంచనాలకు అనుగూణంగానే వారం రోజుల వ్యవధిలో కరోనా కేసులు ఐదు రెట్లు పెరగడం అందోళన కలిగిస్తోంది. గత సోమవారం 6358 కరోనా కేసులు రాగా, ఈ సోమవారం ఆ సంఖ్య ఏకంగా 33 వేలకు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఇదే ఈ భారీ సంఖ్యలో పెరుగుతున్న కేసులే నిదర్శనం.
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోల్చితే దాదాపు 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులకు మాత్రమే సోకిన ఈ కొత్త మహమ్మారి తాజాగా ఎలాంటి వీదేశీయానం లేనివారికి కూడా సోకింది. నిపుణలు చెప్పినట్లు ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కోవిడ్ అంక్షల వైపు మొగ్గు చూపుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య ఏకంగా 1700లకు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 175 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఒమిక్రాన్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ లలోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఢిల్లీలో లెవల్ 2 దశ ఆంక్షలు అమలు చేస్తూ.. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు చేపట్టారు. అయినా కేసులు మాత్రం పెరుగుతూనే వున్నాయి. ఇటు మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 510 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 361 పాజటివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 156, గుజరాత్లో 136, తమిళనాడులో 121, రాజస్తాన్లో 120, తెలంగాణలో 67, కర్నాటకలో 64, హర్యానా 63, ఒడిశా 37, పశ్చిమ బెంగాల్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 17 కేసులు నమోదు కాగా.. మరో 11 రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more