విమానం గగనయానంలో ఉండగా, అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తన గురించి బాధపడని ఆ మహిళ విమానంలోని ప్రయాణికులకు ఇది సోకితే ఎలా అని చాలా భయాందోళనకు గురైంది. విమానంలోని మిగతా ప్రయాణికులకు తన నుంచి కరోనా సోకకుండా అమె జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందుకోసం అమె ఏకంగా విమానం టాయిలెట్ లో ఏకంగా ఐదు గంటల పాటు ఐసొలేట్ అయ్యింది. అమెరికాలో చికాగో నుంచి ఐస్ ల్యాండ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మిచిగాన్కు చెందిన టీచర్ ఫోటీయో, డిసెంబర్ 19న తన కుటుంబ సభ్యులతో కలిసి చికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానంలో ప్రయాణించారు.
విమానం ఆకాశంలో ఉండగా గొంతులో మంటతో ఆమె ఇబ్బంది పడ్డారు. దీంతో విమానంలోని బాత్రూమ్కు వెళ్లారు. తన వద్ద ఉన్న కిట్తో కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆమె చాలా ఆందోళన చెందారు. భయంతో అక్కడే ఏడ్చారు. గమనించిన ఫ్లైట్ అటెండెంట్ రాకీ, వెంటనే ఫోటీయో వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకుని ఆమెను సముదాయించారు. ఆ మహిళ సీటును మార్చేందుకు ఫ్లైట్ అటెండెంట్ ప్రయత్నించారు. అయితే విమానంలో ప్రయాణికులు నిండుగా ఉండటంతో సీట్లు ఖాళీగా లేవు. ఫ్లైట్ అటెండెంట్ రాకీ ఈ విషయాన్ని ఫోటీయోకు చెప్పారు.
మిగతా ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని టాయిలెట్లోనే ఆమె ఐసొలేట్ అయ్యారు. దీంతో ఆ టాయిలెట్ పని చేయడం లేదంటూ నోటీస్ ఉంచారు. మిగతా ప్రయాణమంతా ఆమె ఆ టాయిలెట్లోనే ఉన్నారు. ఐర్లాండ్లో విమానం ల్యాండ్ కాగా ఫోటియో, ఆమె తండ్రి, సోదరుడు చివరగా దిగారు. తండ్రి, సోదరుడికి కరోనా టెస్ట్లో నెగిటివ్ రావడంతో కనెక్ట్ విమానంలో స్విట్జర్లాండ్ వెళ్లారు. ఫోటియోకు విమానాశ్రయంలో మరోసారి రాపిడ్తోపాటు ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్ష నిర్వహించగా రెండింటిలో పాజిటివ్గా వచ్చింది. దీంతో హోటల్కు తరలించి పది రోజులు క్వారంటైన్లో ఉంచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more