కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు రైతుల నిరసన దీక్షలు చేస్తూ.. ఘెరావ్ చేయడంతో వారిని తన జీపుతో తొక్కేస్తూ ముందుకు వెళ్లడంతో నలుగురు రైతులు ఘటనాస్థలంలోనే మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున తన సోంత నియోజకవర్గమైన లఖింపూర్ ఖేరీకి విచ్చేసిన మంత్రిని రైతలు అడ్డుకున్నారు. అంతుకు వారం రోజలు మందు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన రైతులు ఆయనకు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే జరిగిన పోరబాటును సరిదిద్దుకోవాల్సిన కేంద్రమంత్రి.. కేంద్రంతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లాల్సిన మంత్రి.. అవసరం అయితే క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. వారిని తప్పించుకుని వెళ్లే క్రమంలో నలుగురి మరణానికి కారణమయ్యారు.
అయితే ఇంతకీ ఆయన అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఏమిటీ.? జై జవాన్, జై కిసాన్ అంటూ నినదించే దేశంలో ఆయన రైతులకు హెచ్చరికలు జారీ చేసేలా ప్రసంగించారు. తాను తలచుకుంటూ అంటూ మొదలుపెట్టి.. రైతలను టార్గెట్ గా మారారు. ఉన్నతమైన స్థాయిలో కొనసాగుతూ.. పుడమితల్లి ముద్దుబిడ్డపై కారాలు మిరియాలు నూరి.. తన పదవికే ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. తాను కేంద్రమంత్రిని, పార్లమెంటు సభ్యుడిని కాకముందు తానేంటో ప్రజలకు తెలుసని, తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలు చాలంటూ హెచ్చరిస్తూ మాట్లాడారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేరిలో ఆదివారం ఆయన పర్యటనను రైతులు అడ్డుకోవడానికి ఈ ప్రసంగమే కారణంగా తెలుస్తోంది. గత నెల 25న మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి నియోజకవర్గంలో పర్యటించారు. విషయం తెలిసిన రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలకు మించి పట్టదని హెచ్చరించారు. తాను కనుక ఒక్కసారి సవాలును స్వీకరిస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘‘నేను రంగంలోకి దిగితే మీరు (రైతులు) పాలియా నుంచే కాదు, లిఖింపూర్ను కూడా వదిలిపారిపోతారు’’ అంటూ మంత్రి హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more