మహిళలపై నేరాల విషయంలో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో తిరగడం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు అందించిన సమాచారంతో ఇద్దరు పోలీసులు అతడ్ని వెతుక్కుంటూ వచ్చి అరెస్టు చేశారు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన సమాచారం ప్రకారం, లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి తన సొంత కూతుర్ని హత్య చేసి అమె తలను తన చేత్తో పట్టుకుని గ్రామంలోని వీధులగుండా నడిచాడు.
ఇది గమనించిన గ్రామస్తులు సర్వేశ్ కుమార్ ఇలా ఓ యువతి తలను నరికి తీసుకెళ్తున్నడని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన్ను వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు, మార్గమధ్యంలో ఆయను నిలిపి.. ఏంటీ ఇది ఇలా ఎందుకు తిరుగుతున్నావ్.. చేతిలోని తల ఎవరిదీ అని ప్రశ్నించారు. అయితే పోలీసుల అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా సర్వేశ్ కుమార్ సమాధానాలు చెప్పారు. ఇక తలను కింద పెట్టమని చెప్పిన పోలీసులు.. అతడ్ని కింద కూర్చోమని చెప్పారు. దాంతో అలాగే చేశాడు సర్వేశ్ కుమార్.
తన చేతిలోని తల తన కుమార్తే అని సర్వేశ్ కుమార్ ఎలాంటి సంకోఛం లేకుండా ఫోలీసులకు తెలిపాడు. అమెను తాను మాత్రమే పదునైన ఆయుధంతో నరికి చంపానని చెప్పానని సర్వేశ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులు అడిగిన ప్రశ్నకు కూడా ఆన సమాధానం ఇచ్చాడు. తన కుమార్తె పరాయి వ్యక్తితో సంబంధం ఏర్పర్చుకుందని.. దానిని చూసి తాను తట్టుకోలేకపోయానని, అందుచేతే అమెను నరికి చంపానని చెప్పాడు. తలను మాత్రమే తీసుకువచ్చిన తాను మిగతా శరీర భాగం మొత్తం ఇంట్లోనే వుందని తెలిపాడు.
తమకు, సర్వేశ్ కుమార్ కు మధ్య జరిగిన సంభాషణను పోలీసులు వీడియో తీశారు. పెళ్లి కానీ తన కుతూరు.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే తాను హత్య చేశానని అన్నాడు. ఈ ఘటనపై హర్దోయ్ పోలిస్ స్టేషన్ అధికారి కపిల్ దియో సింగ్ మాట్లాడుతూ నిందితుడ్ని తాము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. కాగా ఒక పోలీసు సిబ్బంది మృతురాలి తలను అవమానించేలా పట్టుకున్నందుకు గాను సదరు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ మేరకు వైరల్ అయిన ఓ ఫోటోపై తమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా స్పందించారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more